Sanatan row: డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబును బర్తరఫ్ చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanatan row: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం చెన్నైలో నిరసనను నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర విభాగం తెలిపింది. ఈ వ్యవహారంలో మరో మంత్రి పీకే శేఖర్బాబును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. సనాతన ధర్మ సదస్సులో హిందూ మత, ధర్మాదాయ శాఖకు నేతృత్వం వహిస్తున్న మంత్రి శేఖర్బాబు పాల్గొన్నారని, ఉదయనిధి తన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించారని బీజేపీ పేర్కొంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరగనున్నాయి. తమిళనాడులోని అన్ని జిల్లాల్లో హిందూ ధర్మాదాయ శాఖ కార్యాలయాలను దిగ్బంధించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను చేపట్టనున్నారు. సనాతన్ ధర్మంపై ఉదయనిధికి ఘాటైన బదలిచ్చిన అన్నామలై.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని డీఎంకే ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కేబినెట్లో షెడ్యూల్డ్ కులాల సభ్యుల ప్రాతినిథ్యం గురించి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 20 మంది సభ్యులు ఉండగా, స్టాలిన్ మంత్రివర్గంలో కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే ఉన్నారన్నారు. దీన్ని బట్టి ఏ పార్టీ వెనుకబడిన సమాజానికి అనుకూలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నారు.
Also Read
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
- Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
Also Read: African Union Chairperson: భారత్ ఐదో “సూపర్ పవర్”..
తేనిలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చి 29 నెలలు అవుతోంది.. రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేశారో.. చట్టాలు పూర్తిగా కుప్పకూలాయని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని, మహిళలకు భద్రత లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల ద్వారా సంపాదించిన డబ్బు వారి పాలనలో పెరిగిందని ఆరోపించారు.
చెన్నై సదస్సులో మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని దోమలు, డెంగ్యూ, మలేరియా, జ్వరం, కరోనాతో పోల్చారు. కేవలం వ్యతిరేకించడమే కాకుండా దానిని నిర్మూలించాలన్నారు. ఈ నేపథ్యంసో ఉదయనిధి తన మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. గురువారం నాడు బీజేపీ ప్రతినిధి బృందం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయనిధిపై కేసులు నమోదు చేయడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ మెమోరాండం సమర్పించింది. డీఎంకే నాయకుడి వ్యాఖ్య ప్రతిపక్ష నాయకుల “హిందూ వ్యతిరేక” మనస్తత్వాన్ని వివరించడానికి మాత్రమే ఉపయోగపడిందని, కాషాయ పార్టీ ఇండియా కూటమిని కూడా వివాదంలోకి లాగింది.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!