Sameer Rizvi Double Century: దేశవాళీ క్రికెట్లో సరికొత్త రికార్డు.. 13 ఫోర్లు, 20 సిక్సర్లతో ఊచకోత
- దేశవాళీ క్రికెట్లో సరికొత్త రికార్డు..
- 13 ఫోర్లు, 20 సిక్సర్లతో
- 97 బంతుల్లో 201 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sameer Rizvi Double Century: భారత్లో ఒకవైపు విజయ్ హజారే ట్రోఫీ ఉత్కంఠ భరితంగా కొనసాగుతుండగా.. మరోవైపు, అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో సమీర్ రిజ్వీ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. శనివారం (డిసెంబర్ 21)వ తేదీ శనివారం జరిగిన ఉత్తరప్రదేశ్, త్రిపుర జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. సమీర్ రిజ్వీ అజేయంగా 201 పరుగులు చేసి ఈ స్కోరుకు ముఖ్యమైన భాగాన్ని అందించాడు. ప్రత్యర్థి త్రిపుర జట్టు భారీ స్కోర్ ను చేధించే క్రమంలో 253 పరుగులకే ఆలౌట్ అయ్యి 152 పరుగుల తేడాతో ఓడిపోయింది. త్రిపుర జట్టులో ఆనంద్ భౌమిక్ 68 పరుగులతో కాస్త ప్రతిఘటించగలిగాడు.
Also Read: Copper IUD: లైంగిక జీవితంపై కాపర్ టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలుసా?
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
ఇకపోతే, ఈ మ్యాచ్ లో సమీర్ రిజ్వీ కేవలం 97 బంతుల్లో 13 ఫోర్లు, 20 సిక్సర్లతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్తో సమీర్ దేశవాళీ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్గా రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ లిస్ట్-ఎ క్రికెట్లో ప్రస్తుతం ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోవ్స్ పేరిట ఉంది. అతను 103 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. అదే విధంగా ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ 114 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన వారిలో ఒకడు.
THE SAMEER RIZVI SHOW. 🤯
– 201* (97) with 13 fours and 20 sixes, smashing the fastest double century in Men's U23 State A Trophy. pic.twitter.com/SNNheU6WlP
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2024
Also Read: Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కిక్కిరిసిన స్టేడియం
సమీర్ రిజ్వీ ఐపీఎల్ 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, మెగా వేలానికి ముందు సీఎస్కే అతడిని విడుదల చేయడంతో ఈ సారి జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కేవలం రూ. 95 లక్షలకు తీసుకుంది. ఐపీఎల్ 2025లో సమీర్ తన ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్కు ముఖ్యమైన ఆటగాడిగా మారే అవకాశం ఉంది. సమీర్ రిజ్వీ ప్రస్తుతం అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్ల్లో అతను 153 పరుగులతో ఒక ఇన్నింగ్స్ ఆడగా, మరో మ్యాచ్లో 137 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ ఫామ్ను కొనసాగిస్తే.. అతడు దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కూడా ప్రభావం చూపగలడు.
తాజావార్తలు
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!