Ms Dhoni: హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎంఎస్ ధోనీ.. మరి ఐపీఎల్ సంగతేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2024 సీజన్లో ఆడతాడా? లేదా? అనే దానిపై మాహీ ఫ్యాన్స్ని వెంటాడుతున్న ప్రశ్న. అయితే, వచ్చే సీజన్లో ఆడతాడా? లేదా? అనే విషయంపై ధోనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.. మోకాలి గాయంతో బాధపడుతూనే ఐపీఎల్ 2023 సీజన్లో ఆడిన ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ 2023 అని ఫ్యాన్స్ స్టేడియాల్లోకి తెగ వచ్చారు. ఐపీఎల్ 2023 సీజన్లో 16 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 11 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్కి వచ్చి 34.67 సగటుతో 104 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ధోనీ స్ట్రైయిక్ రేటు 185.71గా ఉంది.
Read Also: Girls Videos Row: కాలేజీ వాష్రూంలో నగ్న దృశ్యాల చిత్రీకరణ.. స్పందించిన జాతీయ మహిళా కమిషన్
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ధోనీ తన సొంత ప్రొడక్షన్లో నిర్మించిన ఎల్జీఎం చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సినిమా ఇవాళ ( జూలై 28) విడుదలైంది. చెన్నైలో ఓ థియేటర్లో సినిమా యూనిట్తో కలిసి మాహీ భార్య సాక్షి సింగ్, ధోనీ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ధోనీకి తమిళ్ ఫ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం.. తమిళనాడుని తన సొంత రాష్ట్రంగా భావిస్తాడు.. ప్రస్తుతం ధోనీ గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నాడు.. ఐపీఎల్ 2024 సీజన్లో ఆడతాడు.. అయితే, మహీకి నటన కొత్తేమీ కాదు.. ఇప్పటికే అనేక యాడ్స్లో యాక్టింగ్ చేశాడు.. ఆయనకి కెమెరా ఫియర్ లేదు అని సాక్షి సింగ్ అన్నారు. మంచి స్క్రిప్ట్ దొరికితే ధోని హీరోగా నటించడానికి కూడా రెఢీగా ఉన్నాడు అంటూ సాక్షి సింగ్ కామెంట్ చేసింది.
Read Also: Potula Sunita: చంద్రబాబు చరిత్ర అంతా మహిళలను అడ్డుపెట్టుకుని చేసిందే
అయితే, స్వయంగా సాక్షి సింగ్ ఈ ప్రకటన చేయడంతో ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్ 2024 సీజన్ ఆడడం ఖాయమే అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక, ధోనీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని సాక్షినే డిసైడ్ చేసేది.. ఐపీఎల్ 2020, 2022 సీజన్లో సీఎస్కే ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్నప్పుడు మొదట స్పందించింది కూడా ఆమెనే.. సాక్షి సింగ్ నిర్మించిన ఎల్జీఎం సినిమాకి యావరేజ్ రేటింగ్ వచ్చింది. ఈ మూవీలో హరీశ్ కళ్యాణ్, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించగా.. నదియా కీలక పాత్రలో నటించింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..