Sajjala Ramakrishna Reddy : రాజశేఖరరెడ్డి వెళుతూ వెళుతూ తన కొడుకును మనకు అప్పగించి వెళ్ళారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వై.యస్.రాజశేఖరరెడ్డి 74వ జయంతి వేడుకలు నిర్వహించారు. సెంట్రల్ ఆఫీసులో జయంతి వేడుకలతో పాటు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ నేతలు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు. అయితే.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి వెళుతూ వెళుతూ తన కొడుకును మనకు అప్పగించి వెళ్ళారన్నారు. ఇలాంటి కలయిక ప్రపంచం లోనే అరుదుగా ఉంటుందని ఆయన అన్నారు.
Also Read : SIIMA Awards 2023: సైమా వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. హోస్ట్గా టాలీవుడ్ హీరో!
Also Read
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
రాజశేఖరరెడ్డికి ఉన్న దార్శనికత, ప్రజల పట్ల ప్రేమ మరింత వైఎస్ఆర్ కుమారుడిగానే కాదు ఆయన ఆలోచనలు, ఆదర్శాలు, దార్శనికత, ప్రేమకు వారసుడు జగన్ అని కొనియాడారు. ఇటువంటి జగన్ తో కలిసి నడుస్తున్నందుకు మనం అందరం గర్వంగా చెప్పుకునే పరిస్థితి అని, సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జగన్ దార్శనిక పాలనకు ఉదాహరణ అన్నారు.
జగనన్న సురక్షా క్యాంపైన్ లో భాగంగా సచివాలయ సారధులు వారం రోజుల్లోనే 60 లక్షల ఇళ్ళను సందర్శించారు. చంద్రబాబు, లోకేష్ పగటి కలలు కంటున్నారని, పాలన అధికారం కాదు బాధ్యత అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని ఆయన అన్నారు.
Also Read : USA: తన రసాయన ఆయుధాలను పూర్తిగా నాశనం చేసిన అమెరికా..
క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా?? అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది జగన్ నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని, జగనే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి గా ఉండాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. జగన్కు బ్రాండ్ అంబాసిడర్లు ప్రజలేనని, సంక్షేమం వైఎస్ఆర్, జగన్ పేటెంట్ అని గర్వంగా చెప్పుకోగలం?? అని ఆయన అన్నారు. చంద్రబాబు ఇలా ఒక్కటైనా చెప్పగలడా?? అని ఆయన ప్రశ్నించారు. నాయకుడు హృదయంతో స్పందించాలి, బ్రెయిన్ తో ఆలోచించాలన్నారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నుంచి ఇలాంటివి ఊహించలేమని, కుట్రలు పన్ని అధికారంలోకి ఎలా రావాలా అని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండాపడ్డారు.
తాజావార్తలు
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?