Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Sajjala Ramakrishna Reddy Sensational Comments On Chandrababu Over It Notice

Sajjala RamaKrishna Reddy: బరితెగించి అవినీతి.. చంద్రబాబుకు నేరుగా రూ.118 కోట్ల ముడుపులు..!

Published Date :September 2, 2023 , 1:41 pm
By Sudhakar Ravula
Sajjala RamaKrishna Reddy: బరితెగించి అవినీతి.. చంద్రబాబుకు నేరుగా రూ.118 కోట్ల ముడుపులు..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Sajjala RamaKrishna Reddy: టీటీడీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. షెల్ కంపెనీ ద్వారా చెందిన కిక్ బాక్స్ ఎలా తీసుకున్నారో ఇంగ్లీష్ పత్రికలు వార్తలు రాశాయన్న ఆయన.. హిందుస్థాన్ టైమ్స్, డెక్కన్ క్రానికల్ లో కథనాలు వచ్చాయి.. ఐటీ ఇచ్చిన నోటీసులను కూడా ముద్రించారు.. కానీ, దీనిపై చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదు? అని నిలదీశారు. మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే వ్యక్తిని విచారించే క్రమంలో అతను స్టేట్‌మెంట్ ఇచ్చాడు.. నేరుగా చంద్రబాబుకు 118 కోట్ల రూపాయలు ముడుపులు అందాయి అని ఆరోపించారు. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెలకు కాంట్రాక్టు ఇచ్చారు.. ఈ రెండు కంపెనీల ద్వారా కొన్ని షెల్ కంపెనీలకు మళ్లినట్లు ఆధారాలతో సహా నోటీసులో పేర్కొన్నారని తెలిపారు.. ఈ విషయాలు బయటకు వచ్చి 48 గంటలు అయినా చంద్రబాబు, ఆ పార్టీ నేతలు స్పందించ లేదన్న ఆయన.. ఈ కేసులో జోన్ షిఫ్ట్ అనే సాంకేతిక అంశాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఆలస్యం చేస్తూ వస్తున్నారని విమర్శించారు.

అసలు ఆరోపణలపై స్పందించకుండా వ్యవస్థల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు సజ్జల.. స్టే తెచ్చుకుని కాలం గడిపేసే అలవాటు చంద్రబాబుదన్న ఆయన.. మాకు దొరికిన ఆధారాల ప్రకారం లెక్కలో లేని ఆదాయం బోగస్ కంపెనీల నుంచి మళ్లీ మీకే చేరాయి అని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో స్పష్టంగా ఉందన్నారు. నారా లోకేష్ సన్నిహితుడు కె.రాజేష్ పాత్ర గురించి ఐటీ శాఖ నోటీసులో ఉందన్నారు సజ్జల. ఇక, అమరావతి ఒక స్కామ్‌.. ఈ పేరుతో తాను, తన అనుచరులు కొన్ని తరాల పాటు దర్జాగా బతికే కుట్ర చేశారన్నారు. టిడ్కో హౌసింగ్ కూడా మరో స్కామ్‌గా అభివర్ణించిన ఆయన.. వెయ్యి రూపాయలు అయ్యే ఎస్ఎఫ్‌టీ ఖర్చును రెండు వేల రూపాయలకు చూపించారు.. 25 ఏళ్ల పాటు పేద ప్రజలు అప్పుల భారం మోసేలా చంద్రబాబు ప్రయత్నం చేశారని ఆరోపించారు.

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Add as a preferred
source on google

మనోజ్ వాసుదేవ్ పార్థసాని తాను చంద్రబాబును తరచూ కలిసినట్లు ఐటీ శాఖ దగ్గర వెల్లడించాడని పేర్కొన్నారు సజ్జల.. చంద్రబాబు బరితెగించి అవినీతికి పాల్పడ్డాడని మండిపడ్డ ఆయన.. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని తేలినా ఈడీ ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి నోటీసుల దశలోనే కేసు తిరుగుతోంది.. కేంద్ర నిఘా సంస్థలు అన్నీ ఈ అంశం పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ ఆధారాలతో కోణంలో మరింత లోతుగా విచారణ చేస్తామని.. కేంద్ర ఏజెన్సీలను కూడా అడుగుతాం అని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరోవైపు.. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధివిధానాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు సజ్జల.. ఆలోచన మంచిదే… అమలుపై చాలా ప్రశ్నలు ఉన్నాయన్న ఆయన.. చర్చలు, సంప్రదింపులు కీలకం .. జమిలి ఎన్నికలు జిందా తిలస్మత్ కాదు.. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి.. అర్జంట్‌గా చర్చించాల్సిన స్థాయి అంశం కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravathi
  • Andhra Pradesh
  • chandrababu
  • IT notice
  • sajjala ramakrishna reddy

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions