Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy : వైసీపీ మంచి మెజారిటీతో గెలుస్తుంది

Sajjala

Sajjala

కౌంటింగ్‌పై పార్టీ శ్రేణులకు అవగాహన కలిగించటం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్‌లో అనుసరించాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తల పై దిశా నిర్దేశం చేశారు సజ్జల.. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ఏజెంట్లకు బాధ్యత ఉంది…. అధికారం ఉందని, కౌంటింగ్ సెంటర్ లో అలర్టు గా ఉండాలన్నారు. బ్యాలెన్స్ గా ఉండాలి…సంయమనం కోల్పోవద్దన్నారు సజ్జల. వైసీపీ మంచి మెజారిటీతో గెలుస్తుందని, వైసీపీకి పడిన ఓట్లు మన పార్టీ అభ్యర్థుల లెక్కలలోకి వచ్చేలా చూడాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. Exit polls పేరుతో అడ్డమైన ఫిగర్స్ వస్తున్నాయని, బీజేపీ నాలుగు వందల టార్గెట్ కోసం అలా చేసినట్టు అనిపిస్తుందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దేశంలోనే చంద్ర బాబు కు పీహెచ్డీ ఉందని, కౌంటింగ్ లో ఏమైనా ఇష్యూస్ వస్తె వెంటనే RO దృష్క్షికి తీసుకెళ్ళాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కౌంటింగ్ సెంటర్ లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే సెంట్రల్ ఆఫీసు దృష్టికి తీసుకురండని ఆయన తెలిపారు.

Exit mobile version