Sajjala Ramakrishna Reddy: వారంరోజులుగా చంద్రబాబు డ్రామాలు ప్రజలు గమనించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రేంజ్ లో చంద్రబాబుని ఆడేసుకున్నారు. కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమాయకుల ప్రాణాలు బలికావడానికి చంద్రబాబే కారణమన్నారు. కందుకూరులో నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదన్నారు. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. పోలీసు యాక్ట్కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ నిర్ణయం అన్ని పార్టీలకు వర్తిస్తుంది. జీవోను ఉల్లంఘిస్తామని టీడీపీ ఛాలెంజ్ చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించడం సబబు కాదని సూచించారు. కుప్పానికి చంద్రబాబు దండయాత్రలా బయల్దేరారు. సభలు పెట్టుకోవద్దని చంద్రబాబుకు ఎవరూ చెప్పలేదన్నారు.
Read Also: Human Composting : మనుషుల మృతదేహాల నుంచి ఎరువులు.. వినడానికే కొత్తగా ఉంది కదూ
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనించాలి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు ఆలోచించాలి. ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత. ప్రజల ప్రాణాలకు కష్టం కలిగించేలా రోడ్లపై సభలు రద్దు చేస్తూ ఓ జీవోను విడుదల చేశాం. ప్రత్యామ్నయ స్థలాలు చూసుకోవాలి. అపార్థాలకు అవకాశం లేకుండా సుదీర్ఘంగా చర్చించి పోలీసు యాక్ట్కు లోబడి జీవోను తీసుకువచ్చాం. దీని తరువాత అసలు ఈ ప్రభుత్వం జీవో తీసుకురావడం ఏంటి, దానికి మేం కట్టుబడటం ఏంటి?అమాయకుల ప్రాణాలు బలి కావడానికి నైతికంగా తాను బాధ్యత వహిస్తున్నానని చెప్పాల్సిన పెద్ద మనిషి. కనీసం సంస్కారం ఉంటుందని ఎవరైనా భావిస్తారు. కానీ చంద్రబాబు తనకు కనీస సంస్కారం లేదని, తానొక ఉన్మాదినంటూ, రక్షస సంస్కృతి అంటూ, వ్యవస్థలను కిళ్ల కింద వేసి నలుపుతానంటూ తన పాలనలో అదే చేశారు.
చంద్రబాబు చైతన్య రథాన్ని ఎక్కడికో ఎత్తుకెళ్లారని తప్పుడు ప్రచారం చేస్తోంది. పోలీసులకు ఇంతకంటే వేరే పని లేదా?చంద్రబాబు ఒక క్రైసిస్ క్రియేట్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ఆయనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కందుకూరులో మీరు పోలీసులు చెప్పిన చోట మీటింగ్ పెట్టుకుంటే ఈ మారణ కాండ జరిగేదా? అమాయక ప్రాణాలు 8 పోయేవా అన్నారు సజ్జల. రోడ్డు మీద సభల కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రిస్క్ లేకుండా చేయడం ప్రభుత్వ బాధ్యత. దానికి చర్యలు తీసుకోవాలా వద్దా? ఏమాత్రం వివేకం ఉన్న వారు ఇది మంచి ఆలోచన, నిర్ణయం అంటున్నారు. ఈ కట్టుబాటుకు వైయస్ఆర్సీపీ కూడా లోబడి ఉంటుంది. చంద్రబాబు ఉల్లంఘించడం సరికాదని మేం చెబుతున్నాం. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని డీఎస్పీ ఎంతో మర్యాదగా మాట్లాడారన్నారు.
Read Also: Karan Johar: నన్ను హత్య చేసిన పర్లేదు.. ఆ హీరోలకు అంత సీన్ లేదు.. కరణ్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?