Sai Ram Shankar : ‘ఒక పథకం ప్రకారం’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సాయిరామ్ శంకర్
- సాయిరామ్ శంకర్ కొత్త సినిమా "ఒక పథకం ప్రకారం"
- సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ సెట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన చిత్రం
- వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం
- గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణ
Sai Ram Shankar : టాలీవుడ్ యంగ్ హీరో సాయిరామ్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 143 సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఒకటి రెండు తప్పితే పెద్దగా కెరీర్ గ్రోత్ కు ఉపయోగపడే సినిమాలు లేవనే చెప్పాలి. దీంతో ఎంతో కాలంగా ఆయన హిట్ కోసం పరితపిస్తున్నారు. ఇప్పుడు ఈ యువ హీరో తన కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నాడు. సాయిరామ్ శంకర్ నటిస్తున్న ఈ కొత్త సినిమా ఇప్పటి వరకు ప్రకటించబడిన చిత్రాల కంటే కొంచెం కొత్తదనంతో పాటు ఎక్స్ ట్రా ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Read Also:APPSC Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక పథకం ప్రకారం”. వినోద్ విహాన్ ఫిల్మ్స్, విహారి సినిమా హౌస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై గార్లపాటి రమేష్తో కలిసి నిర్మిస్తూ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర విశేషాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ “ఇది నా కెరీర్ కి ఎంతో హెల్ప్ అయ్యే సినిమా. నాకు కచ్చితంగా కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ఈ చిత్ర దర్శకుడు వినోద్ తో నేను 2005 నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఈ చిత్రం ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదు. ఇది నా హామీ. ఇందులో నా పాత్ర స్టోరీని డ్రైవ్ చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు సాయి రామ్ శంకర్.
Read Also:Cricket Betting: సంచలనంగా మారిన క్రికెట్ బెట్టింగ్ కేసు.. రూ.176 కోట్లు..!
చిత్ర దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ.. ‘నాకు చిన్నప్పటినుంచి తెలుగు సినిమాలన్నా, తెలుగువాళ్ళన్నా, తెలుగు పచ్చళ్లన్నా చాలా చాలా ఇష్టం. ఒక పథకం ప్రకారం చిత్రంలో ప్రతి మూడు నాలుగు సీన్స్ కు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇందులో ఉన్న రెండు పాటలూ కథను ముందుకు తీసుకువెళ్లేలా ఉంటాయి. రెండు పాటలూ సిద్ శ్రీరామ్ పాడారు. రాజీవ్ రాయ్ సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాయి” అన్నారు.సాయిరామ్ శంకర్ ఈ సినిమాతో ఒక మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!