Sai Pallavi : కాశ్మీర్ లో సందడి చేస్తున్న సాయి పల్లవి.. వైరల్ అవుతున్న పిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయి పల్లవి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ సాయి పల్లవి గార్గి సినిమా తరువాత మరో సినిమాలో కనిపించలేదు.రీసెంట్ గా సాయి పల్లవి కాశ్మీర్ లో సందడి చేసింది.ఆమె తమిళ సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వచ్చినట్టు సమాచారం.తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా SK21 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లోకనాయకుడు కమల్హాసన్ మరియు ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తున్నట్లు సమాచారం.. రెహమాన్ మేనల్లుడు అయిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈసినిమాలో విశ్వరూం ఫేం రాహుల్ బోస్ విలన్గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది. మేలో చెన్నైలో స్టార్ట్ అయిన ఈసినిమా షూటింగ్ ప్రస్తుంతం కశ్మీర్ లో జరుగుతుంది.. కాగా.. ఈ షూటింగ్ కోసం సాయి పల్లవి కూడా కశ్మీర్ వెళ్లారు.ఆమె అక్కడ షూటింగ్ లోకేషన్లో దిగిన ఫోటోలు అలాగే రాహుల్ బోస్ మేకప్ వేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఇక ఈ నెల అంతా కశ్మీర్ లోనే ఈ మూవీ షూటింగ్ జరగబోతున్నట్టు సమాచారం.అలాగే సాయి పల్లవి ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ దేవరలో.. సాయి పల్లవి ఎన్టీఆర్ భార్యగా నటించబోతున్నట్టు తెగ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఇక శివకార్తికేయన్ మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మహావీరుడు చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 14న రిలీజ్ కాబోతోంది
Also Read
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..