Viral Video: పాపం.. రైల్వే ప్లాట్ ఫాంపై పడుకున్న వాళ్లపై నీళ్లు పోసిన ఓ పోలీస్.. వైరల్ అవుతున్న వీడియో..!
వారు ఎక్కాల్సిన రైలు రాలేదని కాస్త విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై ఓ రైల్వే పోలీస్.. అమానవీయంగా ప్రవర్తించాడు. రైల్వే ప్లాట్ ఫామ్ పై పడుకున్న ప్రయాణికులపై నీళ్లు చల్లి లేపాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడున్న కాలంలో తోటి మనుషుల పట్ల గౌరవం, మర్యాద, దయ అనే లక్షణాలు చాలా మందిలో లేవు. కనీసం అవి లేకున్నా కానీ.. ఎలా అలవరుచుకోవాలో కూడా తెలుసుకోవడం లేదు. పెరిగిన టెక్నాలజీ వల్లనో లేదంటే పశ్చాత సంస్కృతి వల్లనో తెలియదు గానీ.. ఇతరుల పట్ల కనీస మానవత్వం చూపడం లేదు. అలాంటి సంఘటన ఇప్పడొకటి చోటుచేసుకుంది.
Read Also: Chattishghar : ప్రియుడి తో రాసలీలలు చేసేందుకు అడ్డుగా ఉన్న కొడుకును చంపిన తల్లి.. చివరికి..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్ లో వారు ఎక్కవలిసిన రైలు కోసం ఎదురుచూస్తూ.. పలువురు ఆ రైల్వే ప్లాట్ ఫామ్ పై నిద్రపోయారు. ఇందులో వృద్ధులు, యువకులు కూడా ఉన్నారు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ రైల్వే పోలీస్ అధికారి ప్లాట్ ఫామ్ పై తిరుగుతూ వృద్ధులు, యువకులపై నీళ్లు చల్లారు. దీంతో వాళ్లు నిద్రలో నుంచి లేచి కూర్చున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఆర్ఐపీ హ్యుమానిటీ’ అనే క్యాప్షన్ తో ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. కేవలం ట్విట్టర్ లోనే 4 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి.
Read Also: Amarnath Yatra 2023: అమర్నాథ్ యాత్ర.. చూడాల్సిన అందాలివే..!
అంతేకాకుండా.. ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఆ పోలీస్ ప్రవర్తించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే.. ప్లాట్ ఫాంలపై నిద్రిస్తున్న ప్రయాణికుల సమస్యను పరిష్కరించే మార్గాలను కనుగొనాలని సూచించారు. ఓ యూజర్ ‘‘ఇది దారుణం. రైలు కోసం వేచి ఉన్నప్పుడు ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అమానుషం.’’ అని అన్నారు. మరోవైపు ఈ వీడియోపై పుణె డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఇందు దూబే స్పందించారు. ప్లాట్ ఫారమ్ పై పడుకోవడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని, అయితే ప్రయాణికులకు ఇలా చెప్పడం సరైన పద్దతి కాదని ఆమె ట్వీట్ చేశారు. ప్రయాణీకులతో హుందాగా, మర్యాదగా వ్యవహరించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
RIP Humanity 🥺🥺
Pune Railway Station pic.twitter.com/M9VwSNH0zn
— 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) June 30, 2023
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో