Sadha : ఇప్పటికీ ఆ సీన్ చుస్తే కంపరంగా అనిపిస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగం లో హీరోయిన్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇష్టం లేని సన్నివేశాలు చేయడం లాంటి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. హీరోయిన్ సదా తనకు జరిగిన అలాంటి సంఘటనగురించి వివరించింది.ఇండస్ట్రీ లో హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటారు. కానీ సదా మాత్రం ఓ సీన్ చేయడానికి ఆ డైరెక్టర్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కొత్త ఆర్టిస్ట్ లతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. ఎంతో మందిని స్టార్స్ గా మార్చిన దర్శకుడు తేజ.దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమాలో సదా హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా గురించి సదా ఆసక్తికర విషయం తెలియ జేసింది.సదా మాట్లాడుతూ జయం సినిమాలో ఆ సీన్ చూస్తే ఇప్పటికీ కంపరంగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేసింది . జయం సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో సదా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో ఓ దశాబ్ధం పాటు వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసనన నటించి మెప్పించింది.అయితే ఆ సినిమాలోని ఓ సీన్ తన జీవితంలో మర్చిపోలేని చేదు గుర్తుగా నిలిచిపోయింది అన్నారు సదా.
నితిన్ ను కలుసుకోవడానికి ఆమె గుడిలో ప్రదిక్షణలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు తెలియకుండా నితిన్ కలుస్తుంది. అప్పుడే ఆ విషయాన్ని కనిపెట్టిన గోపీచంద్ ముందుగానే అక్కడికి చేరుకుని వారిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటాడు.అయితే ఆసీన్ లో విలన్ గా చేసిన గోపీచంద్ సదాను నాలికతో చెంపపై నాకుతాడు.ఆ సీన్ టైంలోనే సదా చాలా ఇబ్బంది పడిందట. నేను చేయను అంటే చెయ్యను.. కావాలంటే నన్ను ఈ సినిమాలోనుంచి తీసేయండి అంటూ వేడుకుందట. కానీ డైరెక్టర్ తేజ మాత్రం సదా మాటను అస్సలు వినలేదట. నువ్వు ఈ సీన్ చేస్తే సినిమాకు హైలెట్ అవుతుంది అంటూ బలవంతం చేశాడని సమాచారం.అంతే కాదు సదా ఇబ్బంది చూసి.. విలన్ గా చేస్తున్న గోపీచంద్ కూడా వద్దులేండి సార్.. ఆమె అంత ఇబ్బంది పడుతుంది అని అన్నారట. కాని తేజ మాత్రం నీకు తెలియదులే అంటూ కోపపడ్డాడట. ఇక అక్కడ ఉన్నవారు కూడా సదాకు సర్ధి చెప్పడంతో అతి కష్టం మీదే ఆమె ఆ సీన్ కి ఒప్పుకునేందటా.ఇక ఆసీన్ అయిపోయిన తరువాత ఇంటికి వెళ్లి బాగా ఏడ్చిందట సదా. అంతే కాదు.. పదిసార్లకు పైగా తన ముఖం కడుక్కుని ఎంతగానో బాధ పడినట్లు ఆమె తెలియజేసింది.. ఇప్పటికీ టీవీలో ఆ సీన్ చూస్తే ఆమె తెగ బాధపడుతుంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!