Sabitha Indra Reddy : చదువుల మంత్రే లిఫ్ట్ ఇస్తే.. ఆ చిన్నారి విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదువుల మంత్రే లిఫ్ట్ ఇస్తే……..ఆ చిన్నారి విద్యార్థుల ఆనందానికి అవదులే లేవు. మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్ లో వెళ్తుండగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి కాలినడకన ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు. వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి చిన్నారులతో మాట్లాడారు. కారులో వస్తారా అని అడుగగా వెంటనే వారు సరే అనటంతో వారిని మంత్రి కారులోనే ఎక్కించుకొని,చాక్లేట్లు అందించి,వారి ఇంటి వద్ద డ్రాప్ చేసారు.గొల్లురు నుండి తండా వరకు వారితో మాట్లాడుతూ మంత్రి బాగా చదివి,ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ప్రోత్సహించారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇదిలా ఉంటే.. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రీమియర్ ఫంక్షన్ హల్ లో 313 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను,80 మంది వికలాంగులకు బ్యాటరీ వాహనాలు,180 మంది మహిళలకు కుట్టు మిషన్లను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పంపిణీ చేశారు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…100 కోట్లతో జల్ పల్లి మునిసిపాలిటీ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో 25 కోట్లకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయా కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ లైట్లు లాంటి కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పహాడి షరీఫ్ లోగల దర్గా ర్యాంప్ రోడ్డు పనులకు 5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం సుమారు 14 కోట్ల నిధులతో దర్గా పైకి రోడ్డు, పార్కింగ్ వసతులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో హోం మంత్రి మహమూద్ అలీ మహేశ్వరం లో డీసీపీ, ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీ, కార్యాలయాలు ఏర్పాటు చేసారన్నారు. డీసీపీ కార్యాలయంకు 3 ఎకరాల భూమి కేటాయించినట్లు.. భవన నిర్మాణానికి డబ్బులు మంజూరు చేయాలన్నారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రి కేసీఆర్కి సన్నిహితులుగా ఉద్యమ కాలం నుండి మహమూద్ అలీ ఉంటున్నా.. సామాన్యులుగా అందరితో కలిసిపోయి పనిచేస్తూ ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!