Sabitha Indra Reddy : చదువుల మంత్రే లిఫ్ట్ ఇస్తే.. ఆ చిన్నారి విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదువుల మంత్రే లిఫ్ట్ ఇస్తే……..ఆ చిన్నారి విద్యార్థుల ఆనందానికి అవదులే లేవు. మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్ లో వెళ్తుండగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి కాలినడకన ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు. వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి చిన్నారులతో మాట్లాడారు. కారులో వస్తారా అని అడుగగా వెంటనే వారు సరే అనటంతో వారిని మంత్రి కారులోనే ఎక్కించుకొని,చాక్లేట్లు అందించి,వారి ఇంటి వద్ద డ్రాప్ చేసారు.గొల్లురు నుండి తండా వరకు వారితో మాట్లాడుతూ మంత్రి బాగా చదివి,ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ప్రోత్సహించారు.
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
ఇదిలా ఉంటే.. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రీమియర్ ఫంక్షన్ హల్ లో 313 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను,80 మంది వికలాంగులకు బ్యాటరీ వాహనాలు,180 మంది మహిళలకు కుట్టు మిషన్లను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పంపిణీ చేశారు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…100 కోట్లతో జల్ పల్లి మునిసిపాలిటీ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో 25 కోట్లకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయా కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ లైట్లు లాంటి కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పహాడి షరీఫ్ లోగల దర్గా ర్యాంప్ రోడ్డు పనులకు 5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం సుమారు 14 కోట్ల నిధులతో దర్గా పైకి రోడ్డు, పార్కింగ్ వసతులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో హోం మంత్రి మహమూద్ అలీ మహేశ్వరం లో డీసీపీ, ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీ, కార్యాలయాలు ఏర్పాటు చేసారన్నారు. డీసీపీ కార్యాలయంకు 3 ఎకరాల భూమి కేటాయించినట్లు.. భవన నిర్మాణానికి డబ్బులు మంజూరు చేయాలన్నారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రి కేసీఆర్కి సన్నిహితులుగా ఉద్యమ కాలం నుండి మహమూద్ అలీ ఉంటున్నా.. సామాన్యులుగా అందరితో కలిసిపోయి పనిచేస్తూ ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారన్నారు.
తాజావార్తలు
-
Pakistan: ‘సింధు నాగరికత మాదే..బుద్ధుడు మా వాడే’.. పాకిస్థాన్ కొత్త నాటకం..
-
Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
-
Sukumar : RC 17 ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!
-
Chiranjeevi: నేషనల్ అవార్డ్ రానివ్వండి, రాకపోనివ్వండి
-
OTR : దేశ రాజధానిలో తెలంగాణకు కేర్ ఆఫ్ లేకుండా పోతుందా?
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!