Scott Edwards: భారీ అంచనాలతో వచ్చాం.. మరిన్ని షాక్లు ఇస్తాం: నెదర్లాండ్స్ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netherlands Captain Scott Edwards Says We Will Win few more Matches in ODI World Cup 2023: భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో తాము భారీ అంచనాలతో బరిలోకి దిగాం అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తెలిపాడు. భీకర ఫామ్లో ఉన్న అగ్రశేణి జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం చాలా గర్వంగా ఉందని, మరిన్ని షాక్లు (మరిన్ని విజయాలు) ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ధర్మశాలలో మంగళవారం జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ భారీ షాక్ ఇచ్చింది. ప్రొటీస్పై 38 పరుగుల తేడాతో గెలిచి.. ప్రపంచకప్లో తొలి విజయాన్ని అందుకుంది.
మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ… ‘చాలా గర్వంగా ఉంది. భారీ అంచనాలతో వన్డే ప్రపంచకప్ 2023కు వచ్చాం. జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. తొలి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మరికొన్ని విజయాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. మేము కొన్ని ప్రణాళికలతో ముందుకు వచ్చాం. అవి కొన్ని మ్యాచ్లలో సఫలం కావొచ్చు, మరికొన్ని మ్యాచ్లలో విఫలం కావొచ్చు’ అని అన్నాడు.
Also Read
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
Also Read: Temba Bavuma: నెదర్లాండ్స్ ఓటమిని మర్చిపోవడానికి ప్రయత్నించను.. చాలా బాధపడాలి: టెంబా బవుమా
‘ప్రపంచకప్ 2023లో మేము తొలి రెండు మ్యాచ్ల్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నాం. మ్యాచ్ జరిగే కొద్ది మేము పట్టు కోల్పోయాం. దాంతో తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలయ్యాం. ఈ విజయాన్ని వదిలి తదుపరి మ్యాచ్లపై దృష్టి సారిస్తాం’ అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ పేర్కొన్నాడు. నెదర్లాండ్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో డచ్ టీం ఎనిమిదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల కంటే నెదర్లాండ్స్ మెరుగైన స్థితిలో ఉండటం విశేషం. నెదర్లాండ్స్ తమ తదుపరి మ్యాచ్ అక్టోబర్ 21న లక్నోలో శ్రీలంకతో ఆడుతుంది.
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!