SA vs IND: వరుణ్ మాయ చేసినా.. రెండో టీ20లో భారత్కు తప్పని ఓటమి!
- రెండో టీ20లోభారత్ ఓటమి
- వరుణ్ చక్రవర్తి (5/17) అద్భుత బౌలింగ్
- హార్దిక్ పాండ్యా విలువైన ఇన్నింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటి మ్యాచ్లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్కు రెండో టీ20లో ఓటమి తప్పలేదు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/17) మాయతో భారత్ను గెలుపు దిశగా నడిపించినా.. ట్రిస్టియన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో 7×4), కొయెట్జీ (19; నాటౌట్; 9 బంతుల్లో 2×4, 1×6) పోరాడడంతో మ్యాచ్ దక్షిణాఫ్రికా సొంతమైంది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులే చేసింది. సెంచరీ హీరో సంజూ శాంసన్ డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ (4) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో 4 ఓవర్లకు భారత్ స్కోర్ 15/3. ఈ దశలో తిలక్ వర్మ (20; 20 బంతుల్లో 1×4, 1×6), అక్షర్ పటేల్ (27; 21 బంతుల్లో 4×4) జట్టును ఆదుకున్నారు. అయితే తిలక్, అక్షర్ కొద్ది వ్యవధిలో అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా (39 నాటౌట్; 45 బంతుల్లో 4×4, 1×6) విలువైన ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేసింది.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
125 పరుగుల లక్ష్యంను దక్షిణాఫ్రికా అలవోకగా ఛేదించేస్తుందనుకుంటే.. వరుణ్ చక్రవర్తి దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో పయనించింది. రికిల్టన్ (13)ను ఔట్ చేసి అర్ష్దీప్ జట్టుకు సింగ్ శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత అద్భుత స్పెల్తో వరుణ్ సఫారీలను వణికించాడు. మార్క్రమ్ (3), హెండ్రిక్స్ (24), యాన్సెన్ (7), క్లాసెన్ (2), మిల్లర్ (0)లను అవుట్ చేశాడు. దాంతో 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 88/7కు చేరుకుంది. చివరి 4 ఓవర్లలో 37 పరుగులు చేయడం కష్టమే అనిపించింది. కానీ అర్ష్దీప్ వేసిన 17వ ఓవర్లో కొయెట్జీ 6, 4 కొట్టడంతో మ్యాచ్ భారత్ నుంచి చేజారిపోయింది. 18వ ఓవర్లో అవేష్ రెండు ఫోర్లు, 19వ ఓవర్లో అర్ష్దీప్ నాలుగు ఫోర్లు ఇవ్వడంతో మ్యాచ్ పోయింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టీ20 బుధవారం జరగనుంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..