SA vs IND: వరుణ్ మాయ చేసినా.. రెండో టీ20లో భారత్కు తప్పని ఓటమి!
- రెండో టీ20లోభారత్ ఓటమి
- వరుణ్ చక్రవర్తి (5/17) అద్భుత బౌలింగ్
- హార్దిక్ పాండ్యా విలువైన ఇన్నింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటి మ్యాచ్లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్కు రెండో టీ20లో ఓటమి తప్పలేదు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/17) మాయతో భారత్ను గెలుపు దిశగా నడిపించినా.. ట్రిస్టియన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో 7×4), కొయెట్జీ (19; నాటౌట్; 9 బంతుల్లో 2×4, 1×6) పోరాడడంతో మ్యాచ్ దక్షిణాఫ్రికా సొంతమైంది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులే చేసింది. సెంచరీ హీరో సంజూ శాంసన్ డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ (4) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో 4 ఓవర్లకు భారత్ స్కోర్ 15/3. ఈ దశలో తిలక్ వర్మ (20; 20 బంతుల్లో 1×4, 1×6), అక్షర్ పటేల్ (27; 21 బంతుల్లో 4×4) జట్టును ఆదుకున్నారు. అయితే తిలక్, అక్షర్ కొద్ది వ్యవధిలో అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా (39 నాటౌట్; 45 బంతుల్లో 4×4, 1×6) విలువైన ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేసింది.
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
125 పరుగుల లక్ష్యంను దక్షిణాఫ్రికా అలవోకగా ఛేదించేస్తుందనుకుంటే.. వరుణ్ చక్రవర్తి దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో పయనించింది. రికిల్టన్ (13)ను ఔట్ చేసి అర్ష్దీప్ జట్టుకు సింగ్ శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత అద్భుత స్పెల్తో వరుణ్ సఫారీలను వణికించాడు. మార్క్రమ్ (3), హెండ్రిక్స్ (24), యాన్సెన్ (7), క్లాసెన్ (2), మిల్లర్ (0)లను అవుట్ చేశాడు. దాంతో 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 88/7కు చేరుకుంది. చివరి 4 ఓవర్లలో 37 పరుగులు చేయడం కష్టమే అనిపించింది. కానీ అర్ష్దీప్ వేసిన 17వ ఓవర్లో కొయెట్జీ 6, 4 కొట్టడంతో మ్యాచ్ భారత్ నుంచి చేజారిపోయింది. 18వ ఓవర్లో అవేష్ రెండు ఫోర్లు, 19వ ఓవర్లో అర్ష్దీప్ నాలుగు ఫోర్లు ఇవ్వడంతో మ్యాచ్ పోయింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టీ20 బుధవారం జరగనుంది.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!