SA vs IND: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. మూడో టీ20 భారత్దే!
- తిలక్ వర్మ మెరుపు సెంచరీ
- అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ
- యాన్సెన్ సంచలన ఇన్నింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు టీ20ల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులు చేయడంతో టీమిండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో 1×4, 4×6), మార్కో యాన్సెన్ (54; 17 బంతుల్లో 4×4, 5×6) సంచలన బ్యాటింగ్తో కంగారెత్తించినా.. చివరికి భారతే పైచేయి సాధించింది. ఈ విజయంతో సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి టీ20 శుక్రవారం జరుగుతుంది.
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్ డకౌట్ అయినా.. అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో 3×4, 5×6), తిలక్ వర్మ (107 నాటౌట్; 56 బంతుల్లో 8×4, 7×6)ల మెరుపులతో భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన తిలక్.. దక్షిణాఫ్రికా బ్యాటర్లపై దాడి చేశాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికే భారత్ 70/1తో నిలిచింది. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న భారత్కు షాక్ తగిలింది. అభిషేక్తో పాటు సూర్యకుమార్ (1) వరుస ఓవర్లలో నిష్క్రమించగా.. హార్దిక్ పాండ్యా (18) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. రమణ్దీప్ (15; 6 బంతుల్లో 1×4, 1×6) అండతో తిలక్ రేచిపోయి సెంచరీ చేశాడు.
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
ఛేదనలో దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే దక్కింది. రికిల్టన్ (20), హెండ్రిక్స్ (21) వేగంగా ఆడినా.. త్వరగా అవుట్ అయ్యారు. స్టబ్స్ (12), మార్క్రమ్ (29)ని భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. దాంతో 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్లను 84 రన్స్ చేసింది. ఈ సమయంలో క్లాసెన్ సిక్స్లతో చెలరేగిపోయాడు. దాంతో 15 ఓవర్లకు స్కోరు 134/4గా నిలిచింది. చివరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 86 పరుగులు చేయాల్సి ఉన్నా క్లాసెన్ దూకుడు భారత్ను కలవరపెట్టింది. 19వ ఓవర్లో హార్దిక్ 30 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికాకు 25 పరుగులు అవసరం కాగా.. ఆర్ష్దీప్ చక్కగా బౌలింగ్ చేశాడు.
తాజావార్తలు
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!