RTC Driver: ఉన్నట్టుండి బస్సు ఆగింది.. డ్రైవర్ పరార్.. అసలేం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Driver: ‘ఆర్టీసీ బస్సులోనే సురక్షిత ప్రయాణం’ అని నమ్మి ప్రయాణిస్తున్నారు జనాలు.. బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయి. కాస్త అటు ఇటు అయినా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. జీవితాలు తారుమారవుతాయి. అయినా పట్టించుకోకుండా కొందరు ఆర్టీసీ ఉద్యోగులు సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. వారి వల్ల సంస్థకు చెడ్డ పేరొస్తుంది. తాజాగా ఓ డ్రైవర్ చేసిన పనికి ప్రయాణికులు నానావస్థలు పడాల్సి వస్తోంది. విజయవాడ బస్టాండ్ నుంచి నూజివీడు డిపోకు చెందిన నాన్ స్టాప్ బస్సు 40మంది ప్రయాణికులతో బయల్దేరింది. అప్పటి వరకు ప్రయాణికులకు టికెట్స్ ఇచ్చిన డ్రైవర్.. మార్గమధ్యంలో బస్సును రోడ్డుపై నిలిపివేసి ఔట్ సోర్సింగ్ డ్రైవర్ రమేష్ పారిపోయాడు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది.
Read Also: Gold Price: దీపావళి ఆఫర్.. కుప్పకూలిన బంగారం ధర
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
రమేష్ అనే వ్యక్తి ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు బస్సు నడిపిస్తున్న క్రమంలో పరిస్థితిని గమనించిన ప్రయాణికులు.. మద్యం తాగి వాహనం నడుపుతున్నావని నిలదీశారు. వెంటనే డ్రైవర్ విజయవాడ ప్రభాస్ కాలేజీ సమీపంలో బస్సు దిగి పారిపోయాడు. అతడి దగ్గర టిక్కెట్లు ఇచ్చే టిమ్ మిషన్తో పాటు ప్రయాణికుల నుంచి వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే స్పందించి మరో బస్సులో ప్రయాణికులను అక్కడి నుంచి పంపించేశారు.
Read Also: Hyderabad Night Traffic: నిబంధనలు పగలేనా ?.. నైట్ ట్రాఫిక్ రూల్స్ కు రెస్టేనా..?
నూజివీడు ఆర్టీసీ డిపో మేనేజర్ వివరణ ఇస్తూ.. ఈ బస్సు విజయవాడ బస్టాండ్ నుంచి నూజివీడు వెళ్తోంది. డ్రైవర్ మద్యం తాగి ఉండొచ్చని భావిస్తున్నామని అన్నారు. అతడ్ని విధుల నుంచి తొలగించామని.. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మరో బస్సు ఏర్పాటు చేసి గమ్య స్థానానికి చేర్చామని తెలిపారు. అతడి వద్ద ఉన్న రూ.2,650, టిక్కెట్ మిషన్ను డ్రైవర్ బంధువులు డిపోలో అప్పగించారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!