RSS: ముస్లిం, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆర్ఎస్ఎస్ యత్నం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Chief Mohan Bhagwat Meets Muslim Leaders: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. హర్యానా భవన్లో ముస్లిం మత పెద్దలతో సంఘ్ చీఫ్ సమావేశం నిర్వహించారు. సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధిపతి ఉమర్ అహ్మద్ ఇలియాసి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంఘ్ చీఫ్ ముస్లిం నాయకులను కలవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు సంవత్సరాలుగా, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లింలు, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నారని
చెబుతున్నారు.
Also Read
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
- Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
2022 సంవత్సరంలో సర్ సంఘ్చాలక్ మొదటిసారిగా ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్లో నిర్మించిన మసీదును సందర్శించారు. భగవత్ ఉత్తర ఢిల్లీలోని ఆజాద్పూర్లోని మదర్సా తజ్వీదుల్ ఖురాన్ను కూడా సందర్శించారు. మోహన్ భగవత్తో పాటు సంఘ్ కార్యకర్తలు కృష్ణ గోపాల్, ఇంద్రేష్ కుమార్ కూడా ఉన్నారు. ఆ సమయంలో మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో సైతం సమావేశం అయ్యారు. అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ చొరవను దేశవ్యాప్తంగా స్వాగతించారు. అయితే, నిపుణులు ఈ సందర్శనను ప్రతీకాత్మకంగా అభివర్ణించారు. సంఘ్ తీసుకున్న నిర్ణయం క్షేత్ర స్థాయిలోనూ కనిపించాలని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాదు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంద్రేష్ కుమార్ న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించి, మందిర ప్రాంగణంలో మట్టి దీపాలను వెలిగించారు.
READ MORE: Peddapuram: పెద్దాపురంలో చీకటి బాగోతం.. మహిళ ఆవేదన వింటే చలించిపోతారంతే..!
ఇది పక్కన పెడితే.. కొంతకాలంగా సంఘ్ ముస్లింలు, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింలతో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశం ఆర్ఎస్ఎస్ యొక్క ఔట్రీచ్ కార్యక్రమంలో భాగం. వేర్పాటువాదులు, ఛాందసవాదులతో పోరాడటం దీని లక్ష్యం. ఈ అంశంపై సర్ సంఘ్చాలక్ మాట్లాడుతూ.. “మనందరికీ పూర్వీకులు ఒక్కరే. కానీ..మనం గతాన్ని మరచిపోయాం. అందుకే మనల్ని మనం భిన్నంగా భావిస్తున్నాం. మన మధ్య కొన్ని వివాదాలు ఉండవచ్చు కానీ మన సాన్నిహిత్యాన్ని మాత్రం కొనసాగించాలి. భారతదేశ విభజన వంటి సంఘటన చాలా బాధాకరం. దీని వల్ల ఒకరిపై మరొకరికి అపనమ్మకం ఏర్పడింది. దీని కారణంగా, అసంబద్ధమైన చర్చలు జరుగుతున్నాయి. మనం ఇవన్నీ పక్కన పెట్టి ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగాలి.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Love Affair: నవ వధువు పెళ్లైన మూడు నెలలకే.. భర్తకు మత్తు మందు ఇచ్చి.. ప్రియుడితో కలిసి..
సంఘ్(ఆర్ఎస్ఎస్) మార్చి 2023 నుంచి ముస్లిం ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద, ముస్లింలను బీజేపీతో అనుసంధానించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను పార్టీ మైనారిటీ ఫ్రంట్కు అప్పగించారు. మొదటి దశలో 14 రాష్ట్రాలు ఎంపిక చేశారు. వీటిలో 64 జిల్లాల్లో ఈ ప్రచారం నిర్వహించారు. ఈ రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, గోవా, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, లడఖ్, మహారాష్ట్ర, కేరళ, బీహార్ ఉన్నాయి. మరోవైపు.. ఆర్ఎస్ఎస్కి చెందిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఈ అంశంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది ఢిల్లీ రాజ్ఘాట్లోని ఈద్ మిలన్ సమరోహ్లో ఫోరమ్ ద్వారా ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ పోషకుడు ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టం లక్ష్యాలు, ప్రయోజనాలను ప్రతి వ్యక్తికి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా 100 కి పైగా ప్రెస్ కాన్ఫరెన్స్లు, 500 కి పైగా సెమినార్లను నిర్వహిస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!