Mohan Bhagwat: ‘హిందువులే ఆవులను వధించడానికి పంపుతున్నారు’… ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గోహత్యపై పెద్ద ప్రకటన చేశారు. ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఆవును వధించడానికి కసాయిని పంపేది హిందువులే అని అన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ గోవు సేవ చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ పిలుపునిచ్చారు. మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్లోని మథురాలోని ఫరా ప్రాంతంలోని దీనదయాళ్ కామధేను గౌశల సమితి కార్యక్రమానికి మంగళవారం చేరుకున్నారు. కార్యక్రమంలో ఆవుల పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం భగవత్ మాట్లాడుతూ, “బంగ్లాదేశ్లో అత్యధిక సంఖ్యలో ఆవులను సాకుతున్నారు, అయితే వాటిని అక్కడికి ఎవరు పంపుతారు అనేది ప్రశ్న? ఈ ఆవులు హిందువుల ఇళ్ల నుండి అక్కడికి చేరుకుంటాయి. వాటిని మోసే ప్రజలు కూడా హిందువులే.’ అన్నారు. భగవత్ ఇక్కడితో ఆగలేదు. అంటూ మరో ప్రశ్న లేవనెత్తాడు. మోహన్ భగవత్ మాట్లాడుతూ.. మేము ఆవును తల్లి అని పిలుస్తాము, కాని ఆవులను వధకు పంపడం కొడుకు విధి? ఆవులను వధకు పంపడం సరైన పని కాదు. గోవులకు సేవ చేస్తాం.. ఇలా వెళ్లనీయ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Also:Uttarakhand : చావు నోట్లో నుంచి బయట పడ్డట్లుంది.. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆవేదన
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ఆవును మనం ఎప్పుడూ మనతోనే ఉంచుకోవాలని, చనిపోయిన తర్వాత దాని కొమ్ము, చర్మం కూడా మనకు ఉపయోగపడుతుందని భగవత్ చెప్పారు. చనిపోయిన తర్వాత కూడా గోవులు మనకు సేవచేస్తుంటే, అవి జీవించి ఉండగా మనం ఎందుకు సేవ చేయలేమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆవుల గురించి అనేక రకాల ప్రామాణికమైన పరిశోధనలను సేకరిస్తామని మోహన్ భగవత్ అన్నారు. గౌశాల సమితి రూ.200 కోట్లతో దీనదయాళ్ కౌ సైన్స్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ను నిర్మించింది. మొదటి దశలో, పరిపాలనా భవనం, తరగతి గది, బయోగ్యాస్ జనరేటర్తో నడిచే నేత కేంద్రం నిర్మించబడ్డాయి. ఈ కేంద్రం ప్రారంభోత్సవం కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మధుర చేరుకున్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?