RSS Chief Mohan Bhagwat: ఇది మతాల మధ్య యుద్ధం కాదు.. ధర్మం, అధర్మానికి మధ్య పోరాటం..
- పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మృతి
- ఈ ఘటనపై స్పందించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- కశ్మీర్లో జరిగిన హత్యలపై తీవ్ర ఆగ్రహం
- ఇది మతాల మధ్య యుద్ధం కాదన్న మోహన్ భగవత్
- ధర్మం, అధర్మానికి మధ్య పోరాటమని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఉగ్రవాదులు కేవలం హిందువులనే లక్ష్యంగా చేరుకున్నారు. ఈ దాడిపై తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. కశ్మీర్లో జరిగిన హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మతాల మధ్య యుద్ధం కాదని.. ధర్మం, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. భారతీయ సంస్కృతిలోని ధర్మం, విలువలను ప్రస్తావించిన మోహన్ భగవత్.. రామాయణంలో రావణుడు ఎలాగైతే చివరి వరకూ మారలేదో.. అలాగే కొందరు దుర్మార్గులు మారరని ఉగ్రవాదులు, పాకిస్థాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాముడు రావణుడికి అవకాశం ఇచ్చిన తిరస్కరించాడని తర్వాతే రాముడు అతన్ని చంపాడని చరిత్ర గుర్తు చేశారు.
READ MORE: Vinay Narwal: పహల్గామ్ బాధితుడు నేవీ ఆఫీసర్ భార్యపై నీచంగా ట్రోలింగ్.. ఒకరు అరెస్ట్
Also Read
పాకిస్థాన్కు సైతం ఎన్నో అవకాశాలు ఇచ్చాం.. వారు మారలేదు.. అలాంటి వారు నశించాల్సిందే అంటూ ఆగ్రహానికి గురయ్యారు. భద్రత పై ప్రజలకు అంచానాలున్నాయని.. అవి నెరవేరుతాయన్నారు. ధర్మం అంటే సత్యం, న్యాయం, మానవతా విలువలు.. ఇవి ఎవరికైనా వర్తిస్తాయని వెల్లడించారు. కానీ కొన్ని చీకటి శక్తులు దేశాన్ని విడదీయడానికి, శాంతిని భంగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి చీకటి శక్తులపై ధర్మం గెలవాల్సిందేనన్నారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని దేశ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్లను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి విషాదాలను నివారించడానికి, దురుద్దేశాన్ని అరికట్టడానికి సమాజంలో ఐక్యత చాలా అవసరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి గుర్తు చేశారు. “మనం ఐక్యంగా ఉంటే, ఎవరూ మనల్ని దురుద్దేశంతో చూసే ధైర్యం చేయరు. ఎవరైనా అలా చేస్తే.. వారి కళ్లు పేలిపోతాయి.” అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్కు భారత ప్రభుత్వం ధీటుగా సమాధానం ఇస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!