Rs 75 Coin: ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్.. ఆ రోజే రూ.75 నాణెం విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs 75 Coin: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్మారకార్థం రూ.75 నాణేన్ని ముద్రించనున్నారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నాణెంపై పార్లమెంట్ కాంప్లెక్స్, కొత్త పార్లమెంట్ భవనం చిత్రం ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ప్రకటన ప్రకారం, 75 రూపాయల నాణెం 44 మిమీ వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది.
నాలుగు లోహాలతో నాణెం తయారీ
నాణేన్ని నాలుగు లోహాలతో తయారు చేయనున్నారు. ఇందులో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉంటాయి. పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం క్రింద ‘2023’ అని రాసి ఉంటుంది. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభ వేడుకల్లో కనీసం 25 పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది. 20 ప్రతిపక్ష పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి.
Also Read
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
Read Also: Dwayne Bravo: ముంబై ఇండియన్స్ మాత్రం ఫైనల్స్ కి రావొద్దు..
వేడుకలో పాల్గొనే పార్టీలు
అధికార ఎన్డీయేలోని 18 మంది సభ్య పార్టీలతో పాటు, బీజేపీతో సహా ఏడు ఎన్డీయేతర పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి. BSP, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (సెక్యులర్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), YSR కాంగ్రెస్, BJD, TDP అటువంటి NDA యేతర పార్టీలు, అవి ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని భావిస్తు్న్నారు.
ప్రధాని మోదీని టార్గెట్ చేసిన విపక్షాలు
కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. ఆయన ప్రభుత్వ దురహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసిందని అన్నారు. మోదీ జీ, పార్లమెంట్ ప్రజలచే స్థాపించబడిన ప్రజాస్వామ్య దేవాలయమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. రాష్ట్రపతి కార్యాలయం పార్లమెంటులో మొదటి భాగం. మీ ప్రభుత్వ దురహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసింది.
Read Also:Alibaba Jobs: రండి బాబు రండి మా దగ్గర ఉద్యోగాలున్నాయ్.. ఆలీబాబా ఆఫర్
75 రూపాయల నాణెం ఇలా ఉంటుంది
పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేయనున్న 75 రూపాయల నాణెం 35 గ్రాములు. ఇందులో 50% వెండి, 40% రాగి, 5% జింక్ మరియు 5% నికెల్ ఉంటాయి. దీని డిజైన్ గురించి చెబుతూ, నాణేనికి ఒకవైపు అశోక స్తంభం తయారు చేయబడి, దిగువన రూ.75 అని వ్రాయబడుతుంది.
తాజావార్తలు
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!