TS Excise Department: తక్కువ ధరకు లిక్కర్ అమ్మితే రూ.4 లక్షల ఫైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Excise Department: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రేపటితో ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో ప్రచారం తారాస్థాయికి చేరనుంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు ఓటింగ్ సమయం దగ్గరపడుతుండగా మరోవైపు ఎక్సైజ్ పాలసీ కూడా ముగియనుంది. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో మద్యం దుకాణదారులు తమ వద్ద ఉన్న మొత్తం స్టాక్ను విక్రయించాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ 28వ తేదీ సాయంత్రం నుంచి 30వ తేదీ వరకు మద్యం విక్రయాలను నిలిపివేయాల్సి ఉంటుంది. సెలవుల కారణంగా మద్యం దుకాణాలు తమ వద్ద ఉన్న మొత్తం నిల్వలను విక్రయించలేకపోవడంతో మద్యం విక్రయదారులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. ఎంఆర్పి ధర కంటే తక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్న వ్యాపారుల స్టాక్ను తక్కువ సమయంలో క్లియర్ చేయాలనే ఉద్దేశ్యంతో ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది.
Read also: Health Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తాగితే చాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
Also Read
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
ఎంఆర్పీ కంటే తక్కువ ధరకు మద్యం విక్రయించరాదని ఎక్సైజ్ కమిషనర్ జ్యోతిబుధ్ ప్రకాశ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఎంఆర్పీ కంటే తక్కువ మద్యం విక్రయిస్తే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మద్యం వ్యాపారులు ఇలా చేస్తే 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు ముగిసినందున మద్యం వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, ఆ తర్వాత 30వ తేదీ వరకు మాత్రమే మద్యం వ్యాపారులకు సరుకులు విక్రయించేందుకు సమయం ఉంది. పెద్ద ఎత్తున విక్రయాలు జరిగినప్పుడు మాత్రమే స్టాక్ మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 28 నుంచి 30వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు బంద్. కొత్త లైసెన్సులు డిసెంబర్ 1 నుంచి విక్రయాలు ప్రారంభించనున్నారు.
Health Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తాగితే చాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తాజావార్తలు
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!