Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav vs Bumrah: నిన్న గువహటి వేదికగా ముంబై ఇండియన్స్(MI), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. ఓవర్లు తగ్గినా మ్యాచ్లో ఉత్సాహం మాత్రం అస్సలు తగ్గలేదు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన జస్ప్రీత్ బుమ్రా VS వైభవ్ సూర్యవంశీ పోరు క్రికెట్ ప్రియులకు కనువిందు చేసింది. ఈ 15 ఏళ్ల కుర్రాడు రెండో ఓవర్లో బుమ్రా వేసిన ఫస్ట్ బాల్నే బౌండరీకి పంపాడు. బుమ్రా వేసిన ఆ లూజ్ డెలివరీని సరిగ్గా వాడుకున్న సూర్యవంశీ, లాంగ్-ఆన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. దానికి బుమ్రా కేవలం చిరునవ్వు నవ్వి తన మార్క్ వైపు వెనుదిరిగాడు. కానీ ఆట అక్కడితో ఆగలేదు. అదే ఓవర్ నాలుగో బంతికి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సూర్యవంశీ మరో సిక్సర్ బాదాడు. ఇప్పటికే భయం, బెదురు లేకుండా అందరి ఓవర్లలో సిక్సర్ల మోత మోగించిన వైభవ్.. చివరికి ప్రపంచం మెచ్చిన యార్కర్ కింగ్ బుమ్రా బౌలింగ్లోనూ ఆధిపత్యం ప్రదర్శించాడు. చివరకు రైట్ ఆర్మ్ పేసర్ శార్దూల్ ఠాకూర్ ఓవర్లో అవుట్ అయ్యాడు. అయితే.. ఇది చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్గా మారనుంది.
READ MORE: Sumanth: మృణాల్కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!
Also Read
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం ప్రభావం ఉన్న మ్యాచ్లలో లక్ష్యంపై స్పష్టత ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కానీ.. ఈ మ్యాచ్లో ముంబై చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 80 పరుగులు జోడించడం, జైస్వాల్ 77 పరుగులతో నాటౌట్గా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లలో 150/3 పరుగులు చేసింది. రాజస్థాన్ అందించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆఖరి ఓవర్లో 35 పరుగులు కావాల్సి ఉండగా ముంబై 7 పరుగులు మాత్రమే చేసింది. 11 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 123/9 పరుగులు చేయడంతో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో గెలిచింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!