Rohith Sharma: స్టేడియంకు కారులో ఆకాష్ అంబానీతో పాటు రోహిత్ శర్మ.. కొత్త ట్విస్టులు ఏం లేవుగా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ ఏప్రిల్ 10, బుధవారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్కు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. మేనేజ్మెంట్ యొక్క ఈ చర్య ముంబై ఇండియన్స్ అభిమానుల నుండి భారీ విమర్శలకు దారితీసింది. ముంబై ఇండియన్స్ కు 5 ఐపీఎల్ టైటిల్స్ ను సాధించినప్పటికీ, రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలగించడంపై అభిమానులు ఫ్రాంచైజీని పెద్ద ఎత్తున్న విమర్శించారు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది.
Also read: Akhil : అయ్యో అఖిల్ ఇలా మారిపోయాడేంటి.. ఈ లుక్ ఎందుకోసమో ..!
Also Read
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
ఇకపోతే హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన తరువాత రోహిత్ను కెప్టెన్గా తిరిగి నియమించాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ, ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేసిన తర్వాత వారి మూడు మ్యాచ్ ల పరాజయాల పరంపరను చివరకు ముగించింది. ఇకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఆకాష్ అంబానీ, రోహిత్ శర్మ వాంఖడే స్టేడియంకు చేరుకున్నారు. ఇక కెప్టెన్సీ మారినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో అశాంతి, గందరగోళం నెలకొన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత రోహిత్ శర్మ ముంబై నుండి నిష్క్రమిస్తారని.. ఇందుకుగాను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో వేలం జరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.
Also read: MI vs RCB: నేడు ఐపీఎల్ లో బిగ్ ఫైట్.. కాకపోతే..?
ఇకపోతే, రోహిత్ శర్మతో కలిసి ఉండేలా ముంబై ఇండియన్స్ తమ శక్తి మేరకు ప్రతిదీ చేస్తుంది. ఇతర ఫ్రాంఛైజీకి వెళ్లనివ్వకుండా అనేక ఆలోచనలు చేస్తోంది. ఇకపోతే 2013 నుండి ముంబై ఇండియన్స్ ను రోహిత్ శర్మ మాత్రమే విజేతగా నిలిపాడు. ఐపీఎల్ 2013 మధ్యలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత, రోహిత్ ముంబై జట్టు అదృష్టాన్ని మార్చాడు. ముంబైని 2013, 2015, 2019, 2019, 2020 లలో మొత్తం ఐదు టైటిళ్లను అందించాడు.
Rohit Sharma with Akash Ambani 🤨🧐 pic.twitter.com/hYSj32vBHo
— Johns (@RITIKAro45) April 10, 2024
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!