Rohit Sharma: 100కు ఆలౌట్ అయినా పర్లేదనుకున్నాం: రోహిత్
- రెండో టెస్టులో భారత్ విజయం
- భారత్ వ్యూహాన్ని వివరించిన రోహిత్
- చాలా రిస్క్ తీసుకున్నామన్న హిట్మ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించేందుకు తాము చాలా రిస్క్ తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బ్యాటర్లు రిస్క్ తీసుకుని దూకుడుగా ఆడే క్రమంలో 100 పరుగులకు ఆలౌటైన ఫర్వాలేదనే మైండ్సెట్తో ఉన్నామని తెలిపాడు. పిచ్ పెద్దగా సహకరించకున్నా.. టీమిండియా బౌలర్లు గొప్పగా రాణించారని ప్రశంసించాడు. రెండో టెస్టు విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. డ్రా అవుతుందనుకున్న రెండో టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన భారత్.. సంచలన విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం భారత్ దూకుడుగా ఆడటం వెనకున్న వ్యూహాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ‘మ్యాచ్లో ఎలా ముందుకెళ్లాలనే దాని గురించి చాలా ఆలోచించాం. గౌతమ్ గంభీర్, నేను కలిసి ఆడాం. అతడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆటను కోల్పోయాం. నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ను ఆలౌట్ చేసి.. మా బ్యాటింగ్పై దృష్టిసారించాలనుకున్నాం. ప్రత్యర్థి జట్టు ఎన్ని పరుగులు చేస్తుందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. బంగ్లాను తక్కువ పరుగులకు కట్టడి చేసి.. వీలైనంత ఎక్కువ రన్రేట్తో బ్యాటింగ్ చేయాలని ప్లాన్ వేసుకున్నాం’ అని హిట్మ్యాన్ చెప్పాడు.
Also Read
Also Read: Babar Azam: బాబర్ అజామ్ సంచలన నిర్ణయం!
‘పిచ్ పెద్దగా సహకరించకున్నా మా బౌలర్లు గొప్పగా రాణించారు. వీలైనంత త్వరగా పరుగులు చేయడానికి పెద్ద రిస్క్ తీసుకున్నాం. బ్యాటర్లు దూకుడుగా ఆడే క్రమంలో 100 లేదా 150 పరుగులకు ఆలౌటైనా ఫర్వాలేదనే మైండ్ సెట్తో ఆడాం. మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలన్నదే మా లక్ష్యం. ఆకాష్ దీప్ బాగా బౌలింగ్ చేశాడు. అతడు చాలా దేశవాళీ క్రికెట్ మ్యాచులు ఆడాడు. ప్రతి ఒక్కరు విజయంలో భాగమయ్యారు. ఈ విజయంతో అందరం సంతోషంగా ఉన్నాం’ అని రోహిత్ తెలిపాడు. మొదటి రోజు వర్షం కారణంగా 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. 2,3 రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. నాలుగో రోజు బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ కాగా.. విధ్వంసక బ్యాటింగ్తో భారత్ కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేసింది. చివరి రోజు రెండో ఇన్నింగ్స్లో బంగ్లా 146 పరుగులకు కుప్పకూలగా.. 95 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఊదేసింది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!