Rohit Sharma: 100కు ఆలౌట్ అయినా పర్లేదనుకున్నాం: రోహిత్
- రెండో టెస్టులో భారత్ విజయం
- భారత్ వ్యూహాన్ని వివరించిన రోహిత్
- చాలా రిస్క్ తీసుకున్నామన్న హిట్మ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించేందుకు తాము చాలా రిస్క్ తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బ్యాటర్లు రిస్క్ తీసుకుని దూకుడుగా ఆడే క్రమంలో 100 పరుగులకు ఆలౌటైన ఫర్వాలేదనే మైండ్సెట్తో ఉన్నామని తెలిపాడు. పిచ్ పెద్దగా సహకరించకున్నా.. టీమిండియా బౌలర్లు గొప్పగా రాణించారని ప్రశంసించాడు. రెండో టెస్టు విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. డ్రా అవుతుందనుకున్న రెండో టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన భారత్.. సంచలన విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం భారత్ దూకుడుగా ఆడటం వెనకున్న వ్యూహాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ‘మ్యాచ్లో ఎలా ముందుకెళ్లాలనే దాని గురించి చాలా ఆలోచించాం. గౌతమ్ గంభీర్, నేను కలిసి ఆడాం. అతడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆటను కోల్పోయాం. నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ను ఆలౌట్ చేసి.. మా బ్యాటింగ్పై దృష్టిసారించాలనుకున్నాం. ప్రత్యర్థి జట్టు ఎన్ని పరుగులు చేస్తుందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. బంగ్లాను తక్కువ పరుగులకు కట్టడి చేసి.. వీలైనంత ఎక్కువ రన్రేట్తో బ్యాటింగ్ చేయాలని ప్లాన్ వేసుకున్నాం’ అని హిట్మ్యాన్ చెప్పాడు.
Also Read
Also Read: Babar Azam: బాబర్ అజామ్ సంచలన నిర్ణయం!
‘పిచ్ పెద్దగా సహకరించకున్నా మా బౌలర్లు గొప్పగా రాణించారు. వీలైనంత త్వరగా పరుగులు చేయడానికి పెద్ద రిస్క్ తీసుకున్నాం. బ్యాటర్లు దూకుడుగా ఆడే క్రమంలో 100 లేదా 150 పరుగులకు ఆలౌటైనా ఫర్వాలేదనే మైండ్ సెట్తో ఆడాం. మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలన్నదే మా లక్ష్యం. ఆకాష్ దీప్ బాగా బౌలింగ్ చేశాడు. అతడు చాలా దేశవాళీ క్రికెట్ మ్యాచులు ఆడాడు. ప్రతి ఒక్కరు విజయంలో భాగమయ్యారు. ఈ విజయంతో అందరం సంతోషంగా ఉన్నాం’ అని రోహిత్ తెలిపాడు. మొదటి రోజు వర్షం కారణంగా 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. 2,3 రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. నాలుగో రోజు బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ కాగా.. విధ్వంసక బ్యాటింగ్తో భారత్ కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేసింది. చివరి రోజు రెండో ఇన్నింగ్స్లో బంగ్లా 146 పరుగులకు కుప్పకూలగా.. 95 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఊదేసింది.
తాజావార్తలు
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్లో ఏముంది..?
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!