Robbery In Shops: స్వైర విహారం చేసిన దొంగలు.. అనేక షాపుల్లో దోపిడీలు..
- రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో దొంగలు స్వైర విహారం.
- దొంగలు షట్టర్ గడ్డపారతో తొలగించి.
- జగద్గిరిగుట్ట పియస్ పరిధిలో ఏటీఎంలో డబ్బులు దొంగలించడానికి దొంగ ప్రయత్నించాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery In Shops: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో దొంగలు స్వైర విహారం చేశారు. అసలు ఇక్కడ పోలీస్ పెట్రోలియం ఉండదన్న రీతిలో నడి చౌరస్తాలో ఓ షాపు షట్టర్ ను గడ్డపారలతో పెకిలించి పకడ్బందీగా దొంగతనం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు అనేక షాపుల్లో ఇదే రీతిలో రాత్రికి రాత్రే దొంగలు తెగబడ్డారు. ఇక్కడి పోలీసులకు దొంగలు తామేమిటో నిరూపించుకున్నారు. దొంగలకు సవాల్ విసిరిన ఈ దొంగల స్వైర విహారంతో ఒక్కసారిగా పట్టణంలో భయం అలుముకుంది. పట్టణంలోని నడి చౌరస్తాలో ఉన్న జీయర్ మొబైల్స్ లో దొంగలు షట్టర్ గడ్డపారతో తొలగించి 1,60,000 నగదు తీసుకెళ్లారు. లక్షల రూపాయల విలువచేసే సెల్ ఫోన్లను మాత్రం దొంగలు ముట్టుకోలేదు. ఈ దాడిలో చాలా పకడ్బందీగా తెలివిగా ఆలోచించి సెల్ఫోన్లను చోరీ చేయలేదు.
అదేవిధంగా నేషనల్ మార్ట్, కేకే ఎలక్ట్రానిక్స్, వోల్టాస్ షాప్, పరిగి రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ హోల్సేల్ కూల్ డ్రింక్స్ షాపులో 20,000 ఇంకా అనేకచోట్ల నగదును తస్కరించారు. ట్రేడర్స్ లో ఒక కాటన్ సిగరెట్లను దొంగిలించారు. ఈ వరస దొంగతనాలపై పోలీసులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే క్లూస్ టీం వెంటనే రంగంలోకి దిగింది. చోరీ జరిగిన వ్యాపార సముదాయాలలో ఫింగర్ ప్రింట్స్ ను పోలీసులు సేకరించారు. నలుగురు దొంగలు జిఆర్ మొబైల్స్ లో ప్రవేశించినట్టు సీసీ ఫుటేజీలో లభ్యమయింది. ఇంకా పట్టణంలో ఎక్కడెక్కడ చోరీలు జరిగాయో ఏమిటో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు 5 లక్షల రూపాయల నగదు వరకు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఓ కారు ఎక్స్ యూవి మహీంద్రా 500లో దర్జాగా వచ్చిన దొంగలు విచ్చలవిడిగా దొంగతనాలు చేశారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారం త్వరలోనే తెలుస్తుంది..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇకపోతే.. జగద్గిరిగుట్ట పియస్ పరిధిలో ఏటీఎంలో డబ్బులు దొంగలించడానికి దొంగ ప్రయత్నించాడు. చంద్రగిరి నగర్ లో యాక్సిస్ బ్యాంక్ ఎటిఎంలో మిషన్ ను బ్రేక్ చేయడానికి యత్నించాడు దొంగ.. అర్ధరాత్రి రెండు గంటలకు ఏటీఎం మెషిన్ నుండి డబ్బులు దొంగలించడానికి యత్నం చేసాడు. ఏటీఎం మెషిన్ డోర్ తెచ్చుకోకపోవడంతో కేటుగాడు వెనుతిరిగాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!