Rishabh Pant: అయ్యో.. రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడే!
Rishabh Pant: న్యూజిలాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి (జనవరి 11న) నుంచి ప్రారంభం కానుంది. కానీ ఈ టైంలో టీమిండియా అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్ నెట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. పలు నివేదికల ప్రకారం.. ప్రాక్టీస్ టైంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, పంత్ నడుము పైన (నడుము దగ్గర) దెబ్బ తగిలినట్లు సమాచారం.
READ ALSO: Andhra Pradesh Census: ఏపీలో జన గణన కసరత్తు ప్రారంభం.. అడ్డుకుంటే జైలుకే..!
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
రిషబ్ పంత్ దాదాపు 50 నిమిషాల పాటు నెట్స్లో శ్రద్ధగా ప్రాక్టీస్ చేశాడు. ఆ టైంలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నా పంత్కు అనుకోకుండా ఒక బంతి నడుము దగ్గర తీవ్రంగా తగిలింది. ఇప్పటి వరకు గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన రానప్పటికీ, జట్టు యాజమాన్యం అతని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సిరీస్కు ముందు ఆటగాళ్ళు తమ ఫిట్నెస్, ఫామ్ను నిరూపించుకుంటున్న టైంలో ఈ సంఘటన జరిగింది.
నిజానికి టీమిండియాలో రిషబ్ పంత్ కీలక ఆటగాడు. జట్టులో పంత్, కెఎల్ రాహుల్ తర్వాత రెండవ వికెట్ కీపర్గా ఉన్నాడు. ఈ గాయం జట్టుకు పెద్ద తలనొప్పిగా మారవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఇప్పుడు పంత్ కోలుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. గాయం తీవ్రంగా లేకపోతే, రిషబ్ త్వరలో జట్టులోకి తిరిగి రావచ్చని సమాచారం. కానీ ఒకవేళ విశ్రాంతి అవసరమైతే, పంత్ ఫస్ట్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సిరీస్లోని మొదటి మ్యాచ్ వడోదరలో జరగనుంది. పంత్ గాయం గురించి జట్టు యాజమాన్యం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలో కూడా..
గతంలో పంత్ 2025 ఇంగ్లాండ్ పర్యటనలో కూడా గాయాల బారినపడ్డాడు. ఈ పర్యటనలో పంత్ లార్డ్స్ టెస్ట్ సమయంలో వేలికి గాయం కావడంతో, అలాగే మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజున కుడి పాదానికి తీవ్ర గాయం అయింది. ఆ టైంలో పంత్ను గోల్ఫ్ కార్ట్ ద్వారా మైదానం నుంచి బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. స్కాన్లలో కాలి బొటనవేలు విరిగినట్లు తేలింది, దీని వల్ల పంత్ కొంతకాలం క్రికెట్ మైదానానికి దూరంగా కూడా ఉన్నాడు. తాజాగా పంత్ మళ్లీ గాయం బారిన పడటం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయాల్లో సరికొత్త శకం.. బీఎన్పీకి కొత్త చీఫ్
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?