Rishabh Pant: అయ్యో.. రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: న్యూజిలాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి (జనవరి 11న) నుంచి ప్రారంభం కానుంది. కానీ ఈ టైంలో టీమిండియా అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్ నెట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. పలు నివేదికల ప్రకారం.. ప్రాక్టీస్ టైంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, పంత్ నడుము పైన (నడుము దగ్గర) దెబ్బ తగిలినట్లు సమాచారం.
READ ALSO: Andhra Pradesh Census: ఏపీలో జన గణన కసరత్తు ప్రారంభం.. అడ్డుకుంటే జైలుకే..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
రిషబ్ పంత్ దాదాపు 50 నిమిషాల పాటు నెట్స్లో శ్రద్ధగా ప్రాక్టీస్ చేశాడు. ఆ టైంలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నా పంత్కు అనుకోకుండా ఒక బంతి నడుము దగ్గర తీవ్రంగా తగిలింది. ఇప్పటి వరకు గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన రానప్పటికీ, జట్టు యాజమాన్యం అతని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సిరీస్కు ముందు ఆటగాళ్ళు తమ ఫిట్నెస్, ఫామ్ను నిరూపించుకుంటున్న టైంలో ఈ సంఘటన జరిగింది.
నిజానికి టీమిండియాలో రిషబ్ పంత్ కీలక ఆటగాడు. జట్టులో పంత్, కెఎల్ రాహుల్ తర్వాత రెండవ వికెట్ కీపర్గా ఉన్నాడు. ఈ గాయం జట్టుకు పెద్ద తలనొప్పిగా మారవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఇప్పుడు పంత్ కోలుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. గాయం తీవ్రంగా లేకపోతే, రిషబ్ త్వరలో జట్టులోకి తిరిగి రావచ్చని సమాచారం. కానీ ఒకవేళ విశ్రాంతి అవసరమైతే, పంత్ ఫస్ట్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సిరీస్లోని మొదటి మ్యాచ్ వడోదరలో జరగనుంది. పంత్ గాయం గురించి జట్టు యాజమాన్యం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలో కూడా..
గతంలో పంత్ 2025 ఇంగ్లాండ్ పర్యటనలో కూడా గాయాల బారినపడ్డాడు. ఈ పర్యటనలో పంత్ లార్డ్స్ టెస్ట్ సమయంలో వేలికి గాయం కావడంతో, అలాగే మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజున కుడి పాదానికి తీవ్ర గాయం అయింది. ఆ టైంలో పంత్ను గోల్ఫ్ కార్ట్ ద్వారా మైదానం నుంచి బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. స్కాన్లలో కాలి బొటనవేలు విరిగినట్లు తేలింది, దీని వల్ల పంత్ కొంతకాలం క్రికెట్ మైదానానికి దూరంగా కూడా ఉన్నాడు. తాజాగా పంత్ మళ్లీ గాయం బారిన పడటం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయాల్లో సరికొత్త శకం.. బీఎన్పీకి కొత్త చీఫ్
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!