Andhra Pradesh Census: ఏపీలో జన గణన కసరత్తు ప్రారంభం.. అడ్డుకుంటే జైలుకే..!
- ఏపీలో జన గణన కసరత్తు ప్రారంభం..
- జన గణన అధికారుల్ని నియమిస్తూ ఉత్తర్వులు..
- జిల్లా, సబ్ డివిజనల్, సబ్ జిల్లాల స్థాయిలో జనగణనకు కమిటీలు..
- విధుల్ని అడ్డుకుంటే జరిమానా, జైలు శిక్ష విధించేలా ఉత్తర్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Census: దేశవ్యాప్తంగా జనగణనకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.. తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన జరగబోతోంది.. తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ వరకు ఇళ్ల వివరాలను సేకరించబోతున్నారు.. తొలిదశలో హౌస్ లిస్టింగ్, గణన ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య జరగనుండగా.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి- మార్చి వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు జనగణన అధికారుల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా, సబ్డివిజనల్, సబ్డిస్ట్రిక్ట్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
Read Also: Sajjala Ramakrishna Reddy: 175 నియోజకవర్గాల్లో వెంటనే ప్రారంభించండి.. సజ్జల కీలక ఆదేశాలు
Also Read
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
అలాగే పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా కూడా జనగణన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జనగణన అధికారుల విధులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జనగణన విధుల్లో అంతరాయం కలిగిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది. ప్రజలు జనగణనకు పూర్తి సహకారం అందించాలని, సరైన సమాచారం అందించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జనగణన ద్వారా లభించే డేటా భవిష్యత్తు విధానాల రూపకల్పనకు కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సమన్వయంతో జనగణన కసరత్తు చేపట్టాలని, ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Censor Issues : జననాయగన్కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!