Rishabh Pant Fine: రిషబ్ పంత్కు భారీ జరిమానా.. రిపీట్ అయితే అంతే సంగతులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Fined Rs 12 Lakh: ఆదివారం విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాదించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన ఢిల్లీకి ఇదే తొలి విషయం. ఐపీఎల్ 17వ సీజన్లో బోణి చేసిన ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్కు భారీ జరిమానా పడింది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ నిర్వాహకులు పంత్కు రూ.12 లక్షల జరిమానా విధించారు.
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయనందున రిషబ్ పంత్కు ఫైన్ వేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఢిల్లీ చేసిన తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఐపీఎల్ 2024లో ఫైన్ బారిన పడ్డ రెండో కెప్టెన్ పంత్. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు జరిమానా విధించారు.
Also Read
Also Read: Sakshi Dhoni: హాయ్ మహీ.. మ్యాచ్ ఓడిపోయామని గ్రహించలేదు!
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. మొదటిసారి స్లో ఓవర్ రేటు నమోదు చేస్తే కెప్టెన్కు రూ. 12 లక్షల జరిమానా పడుతుంది. ఈ సీజన్లో ఇదే రెండోసారి రిపీట్ అయితే కెప్టెన్కు రూ. 24 లక్షలు ఫైన్, జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి పునరావృతమైతే కెప్టెన్కు 30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించబడుతుంది. అంతేకాకుండా ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా విధించబడుతుంది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!