Police Operation: పోలీసులు, స్మగ్లర్ల ముఠాకు మధ్య కాల్పులు.. 64 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil Police Operation: బ్రెజిల్ లోని రియో డి జనీరోలో రెడ్కమాండ్ ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసు జరిపిన ఈ ఆపరేషన్ లో కనీసం 64 మంది మరణించారు. రియో డి జనీరో ప్రాంతంలో మంగళవారం సుమారు 2,500 మంది పోలీసులు, సైనికులు.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాపై దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో 81 మంది అనుమానితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ దాడి సమయంలో పోలీసులకు, స్మగ్లింగ్ ముఠా సభ్యులకు మధ్య జరిగిన కాల్పుల్లో కనీసం 64 మంది మరణించారు. వారిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్ను చేపట్టేందుకు ఏడాదికి పైగా ప్లాన్ చేసినట్లు తెలిపారు.
READ MORE: Tamannaah : ఇండస్ట్రీలో 30 ఏళ్లు దాటితే కథ ముగిసిందనుకునే రోజులు పోయాయి..
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
ఆపరేషన్ కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆపరేషన్ సమయంలో అధికారులు కనీసం 42 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. తొలుత భద్రతా దళాలు ముఠా నియంత్రణలో ఉన్న అనేక ప్రాంతాలను చుట్టుముట్టాయి. వెంటనే కాల్పులు జరిపారు. పోలీసులను లక్ష్యంగా చేసుకోవడానికి ముఠా సభ్యులు డ్రోన్లను ఉపయోగించారని ప్రభుత్వం చెబుతోంది. పెన్హా కాంప్లెక్స్లోని పోలీసు అధికారులపై దాడి చేయడానికి నేరస్థులు డ్రోన్లను ఉపయోగించారని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంతలో, రియో డి జనీరోలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులపై పోలీసుల దాడిని భయంకరమైనదిగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం అభివర్ణించింది.
READ MORE: Cyclone Montha: అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలం.. లైట్హౌస్ని తాకుతున్న కెరటాలు!
రెడ్ కమాండ్ (కమాండో వెర్మెల్హో) అనేది బ్రెజిల్కు చెందిన ఒక క్రిమినల్ ముఠా. ఇది మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా, ప్రత్యర్థి ముఠాలతో టర్ఫ్ యుద్ధాలు, ఇతర నేర కార్యకలాపాలకు పాల్పడుతుంది. ఈ ముఠా 1979లో రియో డి జనీరోలోని ఒక జైలులో స్థాపించారు. సాధారణ నేరస్థులు, రాజకీయ ఖైదీలు కలిసి ఒక సంస్థగా ఏర్పడ్డారు. ఈ ముఠా కార్యకలాపాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!