Punjab Kings: పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్గా రికీ పాంటింగ్..!
- పంజాబ్ కింగ్స్కు హెడ్ కోచ్గా రికీ పాంటింగ్..! ఐపీఎల్ 2024 తర్వాత అతన్ని విడిచిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
- త్వరలో వెలువడనున్న అధికారిక ప్రకటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐపీఎల్ (IPL)లో పంజాబ్ కింగ్స్కు హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. కాగా.. ఐపీఎల్ 2024 తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని విడిచిపెట్టింది. ఈ క్రమంలో.. పాంటింగ్కు పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. పాంటింగ్ చాలా కాలం పాటు ఢిల్లీ జట్టుకు హెడ్ కోచ్గా కొనసాగాడు. కానీ.. ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ క్రమంలో.. జట్టు అతన్ని వదిలేసింది. మరోవైపు.. రికీ పాంటింగ్తో పంజాబ్ కింగ్స్ భారీ ఒప్పందం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ రికీ పాంటింగ్తో భాగస్వామి కాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో.. పాంటింగ్ ప్రధాన కోచ్గా నియమితులైనట్లు అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
Read Also: Russia: ఆఫీసు సమయంలో సె** బ్రేక్!.. పుతిన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఐపీఎల్ 2025కి ముందు పంజాబ్ కింగ్స్ కి ప్రధాన కోచ్గా రికీ పాంటింగ్ నియమితులైనట్లు ESPNcricinfo ధృవీకరించింది. ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఉన్న పాంటింగ్.. రెండు నెలల క్రితమే బయటికొచ్చారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్ జట్టుతో కొన్ని సంవత్సరాల పాటు పని చేసేలా ఒప్పందంపై సంతకం చేశాడు. కాగా.. జట్టు మిగిలిన కోచింగ్ స్టాఫ్పై పాంటింగ్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గతేడాది నుంచి కోచింగ్ యూనిట్లో ఎవరెవరు మిగిలారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
Read Also: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇక, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం..!
కాగా.. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ట్రెవర్ బేలిస్ హెడ్ కోచ్గా ఉన్నారు. సంజయ్ బంగర్ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్గా, చార్లెస్ లాంగెవెల్డ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా.. సునీల్ జోషి స్పిన్ బౌలింగ్ కోచ్గా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ నాలుగు సీజన్లలో ముగ్గురు హెడ్ కోచ్లను మార్చింది. 2024 సీజన్లో జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2014 నుంచి ఐపీఎల్ ప్లేఆఫ్కు పంజాబ్ అర్హత సాధించలేదు. అయితే.. ఇప్పుడు ఈ ఛాలెంజ్ని అధిగమించే బాధ్యత రికీ పాంటింగ్దే. పాంటింగ్కు మొదటి అసైన్మెంట్ ఏమిటంటే.. అతను ఏ ఆటగాళ్లను రిటైన్ చేస్తాడు.. ఎవరిని విడుదల చేస్తాడు. మెగా వేలంలో టార్గెట్ ఏ ఆటగాళ్లపై ఉంటుందనేది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!