Rickshaw drivers Protest: మరో సారి సమ్మెకు సై అంటున్న ఆటో వాలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rickshaw drivers Protest: బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిలిపివేయాలంటూ ఆటో వాలాలు మరో మారు సమ్మెకు సై అంటున్నారు. వాటి కారణంగా తమ ఆదాయానికి తీవ్ర గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైక్ టాక్సీలు సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది ఆటో రిక్షా వాలాల ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేసింది. దీంతో వాటిని నియంత్రించాలని కోరుతున్నారు. నిజానికి బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని పుణే నగరంలోని వివిధ రిక్షా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రిక్షా కార్మికులు నవంబర్ 28న కూడా నిరవధిక ఆందోళనకు దిగారు.
Read Also: PM Modi: గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించిన మోదీ
Also Read
అయితే కమిటీని నియమించి తగిన చర్యలు తీసుకుంటామని సంరక్షక మంత్రి చంద్రకాంత్ పాటిల్ చెప్పడంతో రిక్షా కార్మికులు సమ్మె విరమించారు. ఆ తర్వాత బైక్ ట్యాక్సీ విషయంలో ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.. బైక్ ట్యాక్సీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోమారు నిరవధిక ‘చక్కా జామ్’ నిరసన చేపట్టాలని రిక్షా డ్రైవర్లు నిర్ణయించారు. బైక్ ట్యాక్సీలు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా రిక్షా కార్మికుల డిమాండ్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదు. తాము కూడా ఈ దేశ పౌరులమేనని.. న్యాయం పొందే హక్కు తమకు ఉందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సోమవారం (డిసెంబర్ 12) ఉదయం 11 గంటల నుంచి ఆర్టీఓ కార్యాలయ ప్రాంతానికి వచ్చి ఆందోళన ప్రారంభిస్తామన్నారు.
తాజావార్తలు
-
Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
-
PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
-
Vaibhav Sooryavanshi: “వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే”.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Astrology: మే 20 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!