Rice Research: కొత్తరకం సాంబమసూరి వరి వంగడం .. సాధారణం కన్నా అధిక దిగుబడి
Rice Research: సన్న బియ్యం ఇచ్చే వరి వంగడాల్లో తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యంలో ఉన్న రకం సాంబమసూరి. వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడటంతోపాటు, ఎగుమతుల్లో సైతం మొదటి స్ధానం ఆక్రమించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. వరి అన్నం దొరకటమే గగనమైన రోజుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ సాంబమసూరి రకం వరి వంగడాన్ని ఉత్పత్తి చేశారు. సాంప్రదాయ విత్తనాలకు భిన్నంగా అధిక దిగుబడులు ఇవ్వటం ఈ రకం వరి వంగడం స్పెషాలిటీ. ఇదిలా ఉండగా.. తాజాగా సాధారణ సాంబమసూరి కన్నా సుమారు 20 శాతం అధిక దిగుబడి ఇచ్చే కొత్త వరి వంగడాన్ని రాజేంద్రనగర్లోని భారత వరి పరిశోధన సంస్థ(ఐఐఆర్ఆర్) సృష్టించింది. జీన్ ఎడిటింగ్(జన్యు కూర్పు) పరిజ్ఞానంతో ఈ సన్నరకం వరి వంగడాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు విరివిగా సాగు చేస్తున్న సన్నకం సాంబమసూరి వంగడాల్లోని జన్యువులను కూర్పు ఈ కొత్త విత్తనాన్ని సృష్టించారు.
లాబొరేటరీలో దీనితో సాగు చేసిన పైరులో సాధారణం కన్నా 35 శాతం అధిక దిగుబడి వచ్చింది. రైతుల పొలాల్లో మేలైన యాజమాన్య పద్ధతుల్లో పండిస్తే 20-30 శాతం అధిక దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా వేశారు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తున్న సాధారణ సాంబమసూరి(బీపీటీ 5204) వంగడాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు 1986లో వెలుగులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఆ వంగడం దేశమంతా విస్తరించింది. దీని ధాన్యం నుంచి వచ్చే సన్నరకం బియ్యాన్ని వ్యాపారులు సోనామసూరి అని వివిధ ప్రాంతాల పేర్లను ముందు తగిలించి విక్రయిస్తున్నారు. కర్నూలు సోనా ఈ రకానికి చెందిన బియ్యమే. ఇంత ఆదరణ పొందిన ఈ వంగడంలోని మంచి లక్షణాలు మారకుండా అధిక దిగుబడి పొందేలా జీన్ ఎడిటింగ్ పరిజ్ఞానంతో కొత్త వంగడాన్ని సృష్టించారు. సాధారణ వంగడంలో పండించిన పైరులోని వరి కంకిలో 200 వరకూ గింజలు ఉండగా.. జీన్ ఎడిటింగ్ వంగడంలో 350 నుంచి 400 గింజలు వచ్చాయి.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Yoga Mat: యోగాలో మ్యాట్ ఎంతో కీలకం.. మరి ఎలాంటి మ్యాట్ కొనాలి..?
ఈ జీన్ ఎడిటింగ్తో వరిమొక్కలో మరో కొత్త మార్పు వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. జన్యు కూర్పు చేశాక కొత్త వంగడంతో పెరిగిన వరిమొక్క కాండం సాధారణ వంగడాని కన్నా మరింత బలంగా పెరిగిందన్నారు. ది. అంటే జన్యుకూర్పుతో భారీగా వచ్చే ధాన్యపుగింజల కంకి విరిగి పడిపోకుండా మొక్క కాండం దానంతట అదే బలపడటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అంటే కొత్త మార్పులకు అనుగుణంగా ప్రకృతిలో మొక్కల్లోని జీవజాలంలోనూ మార్పు వస్తుందనడానికి ధాన్యపు గింజల సంఖ్య పెరగగానే కాండం బలపడటం ఒక ఉదాహరణ అని మాకు అర్థమైందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!