Revenge Murder: హత్యకు గురైన తండ్రి.. 27 ఏళ్ల తర్వాత ప్రతీకారం
- హత్యకు గురైన తండ్రి..
- 27 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న కొడుకు
- చంపేందుకు రూ.5 లక్షల కాంట్రాక్ట్.
Revenge Murder: యూపీలోని భదోహిలో ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ సింగ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 27 ఏళ్ల క్రితం జరిగిన హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రిన్సిపాల్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సూత్రధారి సౌరభ్సింగ్తో పాటు ఇతర కుట్రదారులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే హత్యాకాండకు పాల్పడిన వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. సౌరభ్ తండ్రి అజయ్ బహదూర్ సింగ్ 27 ఏళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. అప్పటికి సౌరభ్కి ఏడాది కూడా నిండలేదు. అయితే, పెద్దయ్యాక తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు. అక్టోబరు 21న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ను పట్టపగలు కిరాయి గుండాలచే హతమార్చాడు.
Also Read: PM Modi : రెండ్రోజుల పాటు గుజరాత్ పర్యటనలో మోదీ.. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
Also Read
- Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
27 సంవత్సరాల క్రితం సౌరభ్ తండ్రి అజయ్ బహదూర్ సింగ్ నేషనల్ ఇంటర్ కాలేజ్లో నియమితుడయ్యాడు. అయితే, ఆ సమయంలో అతను హత్యకు గురయ్యాడడు. ఈ హత్య తర్వాత యోగేంద్ర బహదూర్ సింగ్ చేరాడు. ఇకపోతే, సౌరభ్ తండ్రి హత్య కేసులో ఇద్దరు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. అయితే, వారిద్దరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇక్కడ సౌరభ్ మనసులో ప్రతీకార భావం పెరుగుతూనే ఉంది. అజయ్ బహదూర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో యోగేంద్ర బహదూర్ కూడా ఉన్నాడు.
ఈ కేసులో అజయ్ బహదూర్ సింగ్ హత్యకు గురైన సమయంలో అతని కుమారుడు సౌరభ్ సింగ్ వయస్సు 6 నెలలని భదోహి పోలీసులు తెలిపారు. తన తండ్రి హత్య చేయకుంటే యోగేంద్ర బహదూర్ ప్రిన్సిపాల్ అయ్యేవాడు కాదని సౌరభ్ నమ్మబలికాడు. దింతో అతను ప్రిన్సిపాల్ తో శత్రుత్వం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ సింగ్ హత్యకు సౌరభ్ సింగ్ రూ.5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడు. షూటర్లు ఒక నెలపాటు ప్రిన్సిపాల్ను రెక్కీ నిర్వహించారు. అయితే, అక్టోబర్ 21న ఇంటి నుంచి కాలేజీకి వెళ్తుండగా ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ కారులో కాల్చి చంపబడ్డాడు. పోలీసులు ఈ మొత్తం కేసును దర్యాప్తు చేయడం మొదలు పెట్టగా.. 27 ఏళ్ల పగ కారణంగా తండ్రిని హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి హత్య చేసినట్లు తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
-
TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
-
SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!