Revenge Murder: హత్యకు గురైన తండ్రి.. 27 ఏళ్ల తర్వాత ప్రతీకారం
- హత్యకు గురైన తండ్రి..
- 27 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న కొడుకు
- చంపేందుకు రూ.5 లక్షల కాంట్రాక్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revenge Murder: యూపీలోని భదోహిలో ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ సింగ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 27 ఏళ్ల క్రితం జరిగిన హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రిన్సిపాల్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సూత్రధారి సౌరభ్సింగ్తో పాటు ఇతర కుట్రదారులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే హత్యాకాండకు పాల్పడిన వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. సౌరభ్ తండ్రి అజయ్ బహదూర్ సింగ్ 27 ఏళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. అప్పటికి సౌరభ్కి ఏడాది కూడా నిండలేదు. అయితే, పెద్దయ్యాక తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు. అక్టోబరు 21న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ను పట్టపగలు కిరాయి గుండాలచే హతమార్చాడు.
Also Read: PM Modi : రెండ్రోజుల పాటు గుజరాత్ పర్యటనలో మోదీ.. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
27 సంవత్సరాల క్రితం సౌరభ్ తండ్రి అజయ్ బహదూర్ సింగ్ నేషనల్ ఇంటర్ కాలేజ్లో నియమితుడయ్యాడు. అయితే, ఆ సమయంలో అతను హత్యకు గురయ్యాడడు. ఈ హత్య తర్వాత యోగేంద్ర బహదూర్ సింగ్ చేరాడు. ఇకపోతే, సౌరభ్ తండ్రి హత్య కేసులో ఇద్దరు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. అయితే, వారిద్దరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇక్కడ సౌరభ్ మనసులో ప్రతీకార భావం పెరుగుతూనే ఉంది. అజయ్ బహదూర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో యోగేంద్ర బహదూర్ కూడా ఉన్నాడు.
ఈ కేసులో అజయ్ బహదూర్ సింగ్ హత్యకు గురైన సమయంలో అతని కుమారుడు సౌరభ్ సింగ్ వయస్సు 6 నెలలని భదోహి పోలీసులు తెలిపారు. తన తండ్రి హత్య చేయకుంటే యోగేంద్ర బహదూర్ ప్రిన్సిపాల్ అయ్యేవాడు కాదని సౌరభ్ నమ్మబలికాడు. దింతో అతను ప్రిన్సిపాల్ తో శత్రుత్వం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ సింగ్ హత్యకు సౌరభ్ సింగ్ రూ.5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడు. షూటర్లు ఒక నెలపాటు ప్రిన్సిపాల్ను రెక్కీ నిర్వహించారు. అయితే, అక్టోబర్ 21న ఇంటి నుంచి కాలేజీకి వెళ్తుండగా ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ కారులో కాల్చి చంపబడ్డాడు. పోలీసులు ఈ మొత్తం కేసును దర్యాప్తు చేయడం మొదలు పెట్టగా.. 27 ఏళ్ల పగ కారణంగా తండ్రిని హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి హత్య చేసినట్లు తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!