Population Increased: జననాల రేటు పెంచేందుకు దృష్టి సారించిన చైనా.. అందుకోసం భారీ ఆఫర్లు కూడా
- జననాల రేటు పెంచేందుకు దృష్టి సారించిన చైనా..
- భారీ ఆఫర్లు కూడా.
- 13 పాయింట్ల ఔట్లైన్ను రూపొందించిన చైనా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Population Increased: చైనాలో జననాల రేటు గత రెండు సంవత్సరములుగా నిరంతరం తగ్గుతోంది. ఈ పరిస్థితిలో చైనా అనేక విధానాలను ప్రకటించింది. ఇందులో పిల్లల పుట్టుకపై సబ్సిడీ విధానం, అలాగే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబ సభ్యులకు పన్ను తగ్గింపు వంటి విధానాలు ఉన్నాయి. జననాల రేటును పెంచడానికి, ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రజలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిల్లల జనన రేటును పెంచేందుకు వీలుగా చైనా స్టేట్ కౌన్సిల్ సోమవారం దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో డెలివరీ సపోర్టు సేవలను పెంచడం, శిశు సంరక్షణ వ్యవస్థను విస్తరించడం, విద్య, గృహనిర్మాణం, ఉపాధిలో సహాయం అందించడం వంటి 13 పాయింట్ల ఔట్లైన్ను రూపొందించారు.
Read Also: Jammu Kashmir: భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న భారత సైన్యం
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
అంతేకాకుండా, పిల్లల పుట్టుకకు అనుకూలమైన సామాజిక వాతావరణాన్ని సృష్టించడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యత. కొత్త పాలసీల ఆధారంగా శిశు జనన రాయితీ వ్యవస్థను మెరుగుపరచవచ్చని మార్గదర్శకాలలో చెప్పబడింది. రాష్ట్ర కౌన్సిల్ వివాహం, పిల్లలను కనే కొత్త సంస్కృతిని ప్రోత్సహించడంపై ఉద్ఘాటించింది. సరైన వయస్సులో పెళ్లి చేయడం, పిల్లలను తల్లిదండ్రులు ఉమ్మడిగా చూసుకోవడం వంటి వాటి ప్రాధాన్యతను వివరించాలన్నారు. వీటిలో మెరుగైన ప్రసూతి బీమా, ప్రసూతి సెలవులు, సబ్సిడీలు, పిల్లలకు వైద్య సదుపాయాలు ఉన్నాయి. బాలల సంరక్షణ కేంద్రాల కోసం బడ్జెట్ను కేటాయించాలని ఇంకా అటువంటి సేవలకు పన్నులు, రుసుములను మినహాయించాలని కౌన్సిల్ స్థానిక ప్రభుత్వాలను సిఫార్సు చేసింది. చైనా జనాభా 1.4 బిలియన్లు. గతేడాది అక్కడ జననాల రేటు రికార్డు స్థాయికి పడిపోయింది. దాంతో, భారతదేశం చైనాను మించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. తగ్గుతున్న జనాభాతో చైనా ఇబ్బంది పడుతోంది. దాంతో జననాల రేటును పెంచాలని కోరుకుంటోంది.
Read Also: IND vs NZ: భారత్పై విజయం డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ఎక్కువ.. సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!