Revanth Reddy : అన్నదాతకు అండగా నిలవండి.. కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అకాల వర్షంతో రైతాంగం అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజయీయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నదాతకు అపార నష్టం వాటిల్లిన తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : Health: కోడళ్ల అనారోగ్యానికి అత్తలే కారణమట
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
పెట్టుబడి వరద పాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టమాట, మిర్చి, మొక్క జొన్న, పొద్దుతిరుగుడు, శనగా, కూరగాయలు, మామిడి, తదితర పంటలకు తీవ్ర నష్టం సంభవించిందన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంపై రేవంత్ రెడ్డి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సాగు ఖర్చులు పెరిగాయని ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయుత లేని పరిస్థితుల్లో ఆకాల వర్షం సృష్టించిన బీభత్సం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రైతుల పరిస్థితి మారిందన్నారు.
Also Read : Akhilesh Yadav: కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది.. అఖిలేష్ వార్నింగ్..
గతంలో కేంద్ర, రాష్ట్ర బృందాలు పర్యటించి పంట నష్టం చూసేవని కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పంటల బీమా పథకం కూడా లేకుండా చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే పంట నష్టం అంచనా వేసి ఎరానికి రూ. 15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే సీజన్ నుంచి ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేసి తక్షణమే రూ. లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?