గత 25 ఏళ్లుగా మెదక్ పార్లమెంటు బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో నలిగిపోయిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ నర్సాపూర్లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందుకే రాహుల్ గాంధీ నీలం మధుని మెదక్ నుంచి బరిలో నిలిపారని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని దుబ్బాకలో బండకేసి కొడితే ఇక్కడికి వచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లన్నసాగర్ లో వేలాది మంది రైతుల భూములను గుంజుకున్నాడని, మన భూములు గంజుకున్న వెంకట్రామిరెడ్డి ని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, హరీష్ రావుకు వందల కోట్లు ఇచ్చినందుకే వెంకట్రామిరెడ్డి కి టికెట్ ఇచ్చారని, మెదక్ లో ఒక్కమగాడు కూడా కేసీఆర్ కి దొరకలేదా అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’మోడీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాముడు, హనుమాన్ జయంతి లు బీజేపీ వాళ్లకు గుర్తుకి వస్తాయి. మనం తాత, ముత్తాతల నుంచి మనం పండుగలు చేయలేదా. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. ఓట్ల కోసం బిచ్చగాడిలా ఆడుకుంటున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర పిచ్చోడు తిరనాళ్ళకి వెలితే ఎక్కిదిగడానికే సరిపోయింది అన్నట్టు ఉంది. మోడీ మనకు గాడిద గుడ్డు ఇచ్చాడు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీని కర్రు కాల్చి వాత పెట్టాలి. నీలం మధుని లక్ష మెజార్టీతో గెలిపించాలి’ అని సీఎం రేవంత్ అన్నారు.