Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల జాబ్ కాలెండర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్, మూసాపేటలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ.. వృద్దులకు పెన్షన్లు ఇవ్వటం కాదు.. ఇంట్లో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి.. పీజీ, పీహెచ్ డీలు చదువుకున్న వారిని బర్రెలు, గొర్రెలు కాసుకోమంటున్నాడు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ కాలెండర్ విడుదల చేస్తాము అని ఆయన తెలిపారు. అవుటర్ చుట్టూ పక్కల కేసీఆర్, ఆయన కుటుంబం, అనుచరులు 10 వేల ఎకరాల భూమి కబ్జా చేశారు.. పేదలకు ఇండ్లు కట్టించేందుకు నగరంతో పాటు చుట్టూ పక్కల స్థలం లేదనే కేసీఆర్ కి 10 వేల ఎకరాలు కబ్జా చేయటానికి మాత్రం స్థలం ఎలా వచ్చింది అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Tirupati Svims Hospital: స్విమ్స్ సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్.. టీటీడీ ఉద్యోగి తండ్రి మృతి
Also Read
ఎవరూ అడ్డం పడినా ఈసారీ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం పక్కా అని రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు కబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపణలపై, రాష్ట్రంలో బీర్ఎస్ నాయకుల అవినీతిపై, కాంగ్రెస్ పార్టీ అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులపై మేం పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామన్నారు. డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాము.. ఆరు గ్యారంటీలు, నూరు సీట్లు లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. అవినీతిమయమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించటం కోసం హస్తం గుర్తుపై ఓటు వేయండి అని రేవంత్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!