NTV Telugu Site icon

Amjad Basha: ప్రజల తీర్పును గౌరవిస్తూ, నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు..

Amjad Basha

Amjad Basha

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. వైసీపీ నేతలు ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా.. కడపలో మాజీ డిప్యూటి సీఎం అంజాద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ, నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ విజయం కోసం, తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్ గా మొదలైన తన రాజకీయ ప్రయాణం.. రెండు సార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎం వరకు అవకాశం ఇచ్చిన కడప ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అనేక హామీలు నెరవేర్చారని పేర్కొన్నారు.

Read Also: JR NTR: ఎన్టీఆర్ శుభాకాంక్షలు.. గాడిలో పెడతామంటూ బాలయ్య చిన్నల్లుడి రిప్లై

రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం అని నిరూపించిన నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చడం అనేది నైతిక విలువలతో రాజకీయాలు చేయాలని చూపారన్నారు. ఇదే తమకు కూడా నేర్పారని తెలిపారు. కోవిడ్ లాంటి కష్ట కాలంలో కూడా పేద వాడికి అండగా నిలబడ్డామని.. అర్హత ప్రామాణికంగా తీసుకుని అవినీతి రహిత పాలన అందించామని చెప్పారు. పోరాటాలు, ఉద్యమాలు వైఎస్సార్ కాంగ్రెస్ కు కొత్తేమి కాదు.. ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ తరపున అండగా ఉంటామని అంజాద్ బాషా తెలిపారు.

Read Also: Mobile Heating: మీ మొబైల్ హీట్ అవుతుందా.. ఇలా చేసి చూడండి..