Madhya Pradesh: నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. రక్త సంబంధీకులైనా రూపాయి కోసం కొట్టుకు చస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో పాకెట్ మనీగా రూ. 2,000 ఇవ్వడానికి నిరాకరించినందుకు 25 ఏళ్ల వ్యక్తి తన తండ్రిని కొట్టి చంపాడని పోలీసులు సోమవారం తెలిపారు. బాబు చౌదరి (50) అనే రైతు జూన్ 15 రాత్రి దేపాల్పూర్ ప్రాంతంలోని పొలంలో శవమై కనిపించాడని పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) హితికా వాసల్ తెలిపారు.
Read Also:Bandi Sanjay: రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ విడుదల చేయాలి.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ..!
నేరం జరిగిన ప్రదేశం నుండి సేకరించిన విచారణ, సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు బాధితుడి కుమారుడు సోహన్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు డ్రగ్స్కు అలవాటు పడ్డాడని, తన తండ్రికి తమ పొలంలో సహాయం చేసేవాడని అధికారి తెలిపారు. “జూన్ 15 రాత్రి సోహన్ తన తండ్రిని పాకెట్ మనీగా రూ. 2,000 అడిగాడు, కాని అతను ఇవ్వనని ఖచ్చితంగా నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సోహన్ పొలంలో ఉన్న రాయిని తీసుకుని బాధితుడిపై దాడి చేసి తలను చితకబాదాడు’’ అని వాసల్ తెలిపారు. కేసుపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వారు వివరించారు.
Read Also:Botsa Satyanarayana: పవన్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్