NCERT: ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో “బాబ్రీ మసీదు” పేరు తొలగింపు..
- “బాబ్రీ మసీదు” పేరును 'మూడు గోపురాల నిర్మాణం' గా మార్పు
- నాలుగు నుంచి రెండు పేజీలకు తగ్గిన అయోధ్య అధ్యాయం
- వివరాలన్నీ సంక్షిప్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. మార్పుల అనంతరం మార్కెట్లోకి కొత్త ఎడిషన్ విడుదల చేసింది. “బాబ్రీ మసీదు” అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. అదనంగా, అయోధ్య అధ్యాయం నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు తగ్గించబడింది. “బాబ్రీ మసీదు” పదానికి బదులుగా ‘మూడు గోపురాల నిర్మాణం’ అనే పదాన్ని జోడించారు. రాముడి రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత హింస, రాష్ట్రపతి పాలన విధించడం వంటి అంశాల గురించి ప్రస్తావించిన దాని కంటెంట్ నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు తగ్గించారు.
READ MORE: Railway Board: రైలు డ్రైవర్ల వేగ ఉల్లంఘనను సమీక్షించడానికి రైల్వే బోర్డు కమిటీ..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
బాబ్రీ మసీదు 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించిన మసీదుగా వర్ణించారు. 1528లో రాముడి జన్మస్థలంలో హిందూ చిత్రలేఖనాలు, శిల్పాలతో నిర్మించిన నిర్మాణంగా వర్ణించబడింది. మతపరమైన ఉద్రిక్తత, అల్లర్లకు దారితీసిన మసీదును ప్రార్థన కోసం తెరవాలని 1986 ఫైజాబాద్ జిల్లా కోర్టు నిర్ణయాన్ని పాత పుస్తకం వివరించింది. కొత్త పుస్తకం ఈ సంఘటనలను క్లుప్తంగా
వివరిస్తుంది. ‘మూడు గోపురాల నిర్మాణం’ ప్రారంభోత్సవం, ఆ తర్వాత జరిగిన చట్టపరమైన, మతపరమైన వైరుధ్యాలను వివరిస్తుంది. కొత్త వెర్షన్లో వివాదాస్పద భూమి ఆలయానికి చెందుతుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ వివరణ అందులో పొందుపరిచారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వ తొలగింపునకు సంబంధించిన వార్తాపత్రిక కటింగ్లను కూడా పుస్తకాల నుంచి తీసేశారు. ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావన తొలగించబడింది.
READ MORE: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి..
కొత్త పుస్తకంలో బీజేపీ రథయాత్ర ప్రస్తావన తొలగించారు. “రెండవ పరిణామం 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు బాబ్రీ మసీదు సముదాయాన్ని తెరవాలని ఆదేశించింది. తద్వారా హిందువులు దేవాలయంగా పరిగణించబడే ప్రదేశంలో ప్రార్థనలు చేయవచ్చు. అయోధ్యలోని బాబ్రీ మసీదుకు సంబంధించి దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. బాబ్రీ మసీదు అయోధ్యలోని 16వ శతాబ్దపు మసీదు.. దీనిని మొఘల్ చక్రవర్తి బాబర్ జనరల్ మీర్ బాకీ నిర్మించారు. ఆయన జన్మస్థలంగా భావించే రాముడి ఆలయాన్ని కూల్చివేసి దీనిని నిర్మించారని కొందరు హిందువులు నమ్ముతారు. ఈ వివాదం కోర్టు కేసు రూపంలో కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. 1940లలో కేసు కోర్టులో ఉన్నందున మసీదుకు తాళం వేశారు.
తాజావార్తలు
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!