NCERT: ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో “బాబ్రీ మసీదు” పేరు తొలగింపు..
- “బాబ్రీ మసీదు” పేరును 'మూడు గోపురాల నిర్మాణం' గా మార్పు
- నాలుగు నుంచి రెండు పేజీలకు తగ్గిన అయోధ్య అధ్యాయం
- వివరాలన్నీ సంక్షిప్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. మార్పుల అనంతరం మార్కెట్లోకి కొత్త ఎడిషన్ విడుదల చేసింది. “బాబ్రీ మసీదు” అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. అదనంగా, అయోధ్య అధ్యాయం నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు తగ్గించబడింది. “బాబ్రీ మసీదు” పదానికి బదులుగా ‘మూడు గోపురాల నిర్మాణం’ అనే పదాన్ని జోడించారు. రాముడి రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత హింస, రాష్ట్రపతి పాలన విధించడం వంటి అంశాల గురించి ప్రస్తావించిన దాని కంటెంట్ నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు తగ్గించారు.
READ MORE: Railway Board: రైలు డ్రైవర్ల వేగ ఉల్లంఘనను సమీక్షించడానికి రైల్వే బోర్డు కమిటీ..
Also Read
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
బాబ్రీ మసీదు 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించిన మసీదుగా వర్ణించారు. 1528లో రాముడి జన్మస్థలంలో హిందూ చిత్రలేఖనాలు, శిల్పాలతో నిర్మించిన నిర్మాణంగా వర్ణించబడింది. మతపరమైన ఉద్రిక్తత, అల్లర్లకు దారితీసిన మసీదును ప్రార్థన కోసం తెరవాలని 1986 ఫైజాబాద్ జిల్లా కోర్టు నిర్ణయాన్ని పాత పుస్తకం వివరించింది. కొత్త పుస్తకం ఈ సంఘటనలను క్లుప్తంగా
వివరిస్తుంది. ‘మూడు గోపురాల నిర్మాణం’ ప్రారంభోత్సవం, ఆ తర్వాత జరిగిన చట్టపరమైన, మతపరమైన వైరుధ్యాలను వివరిస్తుంది. కొత్త వెర్షన్లో వివాదాస్పద భూమి ఆలయానికి చెందుతుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ వివరణ అందులో పొందుపరిచారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వ తొలగింపునకు సంబంధించిన వార్తాపత్రిక కటింగ్లను కూడా పుస్తకాల నుంచి తీసేశారు. ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావన తొలగించబడింది.
READ MORE: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి..
కొత్త పుస్తకంలో బీజేపీ రథయాత్ర ప్రస్తావన తొలగించారు. “రెండవ పరిణామం 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు బాబ్రీ మసీదు సముదాయాన్ని తెరవాలని ఆదేశించింది. తద్వారా హిందువులు దేవాలయంగా పరిగణించబడే ప్రదేశంలో ప్రార్థనలు చేయవచ్చు. అయోధ్యలోని బాబ్రీ మసీదుకు సంబంధించి దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. బాబ్రీ మసీదు అయోధ్యలోని 16వ శతాబ్దపు మసీదు.. దీనిని మొఘల్ చక్రవర్తి బాబర్ జనరల్ మీర్ బాకీ నిర్మించారు. ఆయన జన్మస్థలంగా భావించే రాముడి ఆలయాన్ని కూల్చివేసి దీనిని నిర్మించారని కొందరు హిందువులు నమ్ముతారు. ఈ వివాదం కోర్టు కేసు రూపంలో కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. 1940లలో కేసు కోర్టులో ఉన్నందున మసీదుకు తాళం వేశారు.
తాజావార్తలు
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!