NCERT: ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో “బాబ్రీ మసీదు” పేరు తొలగింపు..
- “బాబ్రీ మసీదు” పేరును 'మూడు గోపురాల నిర్మాణం' గా మార్పు
- నాలుగు నుంచి రెండు పేజీలకు తగ్గిన అయోధ్య అధ్యాయం
- వివరాలన్నీ సంక్షిప్తం
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. మార్పుల అనంతరం మార్కెట్లోకి కొత్త ఎడిషన్ విడుదల చేసింది. “బాబ్రీ మసీదు” అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. అదనంగా, అయోధ్య అధ్యాయం నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు తగ్గించబడింది. “బాబ్రీ మసీదు” పదానికి బదులుగా ‘మూడు గోపురాల నిర్మాణం’ అనే పదాన్ని జోడించారు. రాముడి రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత హింస, రాష్ట్రపతి పాలన విధించడం వంటి అంశాల గురించి ప్రస్తావించిన దాని కంటెంట్ నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు తగ్గించారు.
READ MORE: Railway Board: రైలు డ్రైవర్ల వేగ ఉల్లంఘనను సమీక్షించడానికి రైల్వే బోర్డు కమిటీ..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
బాబ్రీ మసీదు 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించిన మసీదుగా వర్ణించారు. 1528లో రాముడి జన్మస్థలంలో హిందూ చిత్రలేఖనాలు, శిల్పాలతో నిర్మించిన నిర్మాణంగా వర్ణించబడింది. మతపరమైన ఉద్రిక్తత, అల్లర్లకు దారితీసిన మసీదును ప్రార్థన కోసం తెరవాలని 1986 ఫైజాబాద్ జిల్లా కోర్టు నిర్ణయాన్ని పాత పుస్తకం వివరించింది. కొత్త పుస్తకం ఈ సంఘటనలను క్లుప్తంగా
వివరిస్తుంది. ‘మూడు గోపురాల నిర్మాణం’ ప్రారంభోత్సవం, ఆ తర్వాత జరిగిన చట్టపరమైన, మతపరమైన వైరుధ్యాలను వివరిస్తుంది. కొత్త వెర్షన్లో వివాదాస్పద భూమి ఆలయానికి చెందుతుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ వివరణ అందులో పొందుపరిచారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వ తొలగింపునకు సంబంధించిన వార్తాపత్రిక కటింగ్లను కూడా పుస్తకాల నుంచి తీసేశారు. ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావన తొలగించబడింది.
READ MORE: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి..
కొత్త పుస్తకంలో బీజేపీ రథయాత్ర ప్రస్తావన తొలగించారు. “రెండవ పరిణామం 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు బాబ్రీ మసీదు సముదాయాన్ని తెరవాలని ఆదేశించింది. తద్వారా హిందువులు దేవాలయంగా పరిగణించబడే ప్రదేశంలో ప్రార్థనలు చేయవచ్చు. అయోధ్యలోని బాబ్రీ మసీదుకు సంబంధించి దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. బాబ్రీ మసీదు అయోధ్యలోని 16వ శతాబ్దపు మసీదు.. దీనిని మొఘల్ చక్రవర్తి బాబర్ జనరల్ మీర్ బాకీ నిర్మించారు. ఆయన జన్మస్థలంగా భావించే రాముడి ఆలయాన్ని కూల్చివేసి దీనిని నిర్మించారని కొందరు హిందువులు నమ్ముతారు. ఈ వివాదం కోర్టు కేసు రూపంలో కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. 1940లలో కేసు కోర్టులో ఉన్నందున మసీదుకు తాళం వేశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో