Jio Space Fiber: ఇక మారుమూల ప్రాంతాలలో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్.. జియో కొత్త టెక్నాలజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Space Fiber: రిలయన్స్ జియో దేశంలోని మారుమూల ప్రాంతాలను కనెక్ట్ చేయడానికి జియో స్పేస్ ఫైబర్ కొత్త సాంకేతికతను తీసుకువస్తోంది. ఈ టెక్నాలజీ సహాయంతో గ్రామాలు, కష్టతరమైన ప్రాంతాలలో కూడా నెట్వర్క్ సమస్య ఉండదు. ఇంటర్నెట్ స్పీడ్ కూడా మారుతుంది. ‘జియో స్పేస్ ఫైబర్’ శాటిలైట్ బేస్డ్ గిగా ఫైబర్ టెక్నాలజీని తీసుకువస్తోంది. ఫైబర్ కేబుల్ ద్వారా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం కష్టంగా ఉన్న మారుమూల ప్రాంతాలను ఇది కలుపుతుంది. ఈ సేవ సరసమైన ధరలో దేశవ్యాప్తంగా అందించబడుతుంది. అక్టోబర్ 27 నుండి 29 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో జియో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
Read Also:MLA Laxma Reddy: అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే.. కారు గుర్తుకే ఓటు వేయండి: లక్ష్మారెడ్డి
Also Read
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ జియో భారతదేశంలోని మిలియన్ల గృహాలు, వ్యాపారాలను మొదటిసారిగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అనుభవించేలా చేసిందని అన్నారు. జియో స్పేస్ ఫైబర్తో ఇప్పటికీ కనెక్ట్ కాని మిలియన్ల మంది వ్యక్తులను కవర్ చేసినట్లు కంపెనీ తెలిపింది. జియో స్పేస్ ఫైబర్ విద్య, ఆరోగ్యం లేదా ఇతర విషయాల కోసం ఉపయోగించవచ్చు. ఇది ప్రతిచోటా అందుబాటులో ఉంటుంది. భారతదేశంలోని నాలుగు అత్యంత మారుమూల ప్రాంతాలను జియో స్పేస్ ఫైబర్ ద్వారా అనుసంధానం చేయడం గమనార్హం. వీటిలో గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్, ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒరిస్సాలోని నబరంగ్పూర్, అస్సాంలోని ఓఎన్జిసి-జోర్హాట్ ఉన్నాయి. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ తర్వాత రిలయన్స్ జియో కనెక్టివిటీ పోర్ట్ఫోలియోలో ఇది మూడవ ప్రధాన సాంకేతికత.
Read Also:Lunar Eclipse 2023: ఈ ఏడాదిలో రెండో చంద్ర గ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా..?
‘జియో స్పేస్ ఫైబర్’ ద్వారా మారుమూల ప్రాంతాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు SES కంపెనీ ఉపగ్రహాలను ఉపయోగించనున్నారు. అంటే ‘Jio Space Fiber’ ఇప్పుడు ఎక్కడైనా, ఎప్పుడైనా బహుళ-గిగాబిట్ కనెక్టివిటీని అందిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అందించడానికి ‘జియో స్పేస్ ఫైబర్’ వినూత్నమైన, అధునాతన NGSO సాంకేతికతను ఉపయోగిస్తుంది. గ్రామీణ భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే శక్తి ‘జియో స్పేస్ ఫైబర్’కు ఉందని టెలికాం రంగానికి సంబంధించిన నిపుణులు భావిస్తున్నారు. సరసమైన, విశ్వసనీయమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో విద్య, ఆరోగ్య రంగంలో పెద్ద మార్పులు ఆశించబడతాయి.
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!