Jio Space Fiber: ఇక మారుమూల ప్రాంతాలలో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్.. జియో కొత్త టెక్నాలజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Space Fiber: రిలయన్స్ జియో దేశంలోని మారుమూల ప్రాంతాలను కనెక్ట్ చేయడానికి జియో స్పేస్ ఫైబర్ కొత్త సాంకేతికతను తీసుకువస్తోంది. ఈ టెక్నాలజీ సహాయంతో గ్రామాలు, కష్టతరమైన ప్రాంతాలలో కూడా నెట్వర్క్ సమస్య ఉండదు. ఇంటర్నెట్ స్పీడ్ కూడా మారుతుంది. ‘జియో స్పేస్ ఫైబర్’ శాటిలైట్ బేస్డ్ గిగా ఫైబర్ టెక్నాలజీని తీసుకువస్తోంది. ఫైబర్ కేబుల్ ద్వారా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం కష్టంగా ఉన్న మారుమూల ప్రాంతాలను ఇది కలుపుతుంది. ఈ సేవ సరసమైన ధరలో దేశవ్యాప్తంగా అందించబడుతుంది. అక్టోబర్ 27 నుండి 29 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో జియో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
Read Also:MLA Laxma Reddy: అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే.. కారు గుర్తుకే ఓటు వేయండి: లక్ష్మారెడ్డి
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ జియో భారతదేశంలోని మిలియన్ల గృహాలు, వ్యాపారాలను మొదటిసారిగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అనుభవించేలా చేసిందని అన్నారు. జియో స్పేస్ ఫైబర్తో ఇప్పటికీ కనెక్ట్ కాని మిలియన్ల మంది వ్యక్తులను కవర్ చేసినట్లు కంపెనీ తెలిపింది. జియో స్పేస్ ఫైబర్ విద్య, ఆరోగ్యం లేదా ఇతర విషయాల కోసం ఉపయోగించవచ్చు. ఇది ప్రతిచోటా అందుబాటులో ఉంటుంది. భారతదేశంలోని నాలుగు అత్యంత మారుమూల ప్రాంతాలను జియో స్పేస్ ఫైబర్ ద్వారా అనుసంధానం చేయడం గమనార్హం. వీటిలో గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్, ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒరిస్సాలోని నబరంగ్పూర్, అస్సాంలోని ఓఎన్జిసి-జోర్హాట్ ఉన్నాయి. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ తర్వాత రిలయన్స్ జియో కనెక్టివిటీ పోర్ట్ఫోలియోలో ఇది మూడవ ప్రధాన సాంకేతికత.
Read Also:Lunar Eclipse 2023: ఈ ఏడాదిలో రెండో చంద్ర గ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా..?
‘జియో స్పేస్ ఫైబర్’ ద్వారా మారుమూల ప్రాంతాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు SES కంపెనీ ఉపగ్రహాలను ఉపయోగించనున్నారు. అంటే ‘Jio Space Fiber’ ఇప్పుడు ఎక్కడైనా, ఎప్పుడైనా బహుళ-గిగాబిట్ కనెక్టివిటీని అందిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అందించడానికి ‘జియో స్పేస్ ఫైబర్’ వినూత్నమైన, అధునాతన NGSO సాంకేతికతను ఉపయోగిస్తుంది. గ్రామీణ భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే శక్తి ‘జియో స్పేస్ ఫైబర్’కు ఉందని టెలికాం రంగానికి సంబంధించిన నిపుణులు భావిస్తున్నారు. సరసమైన, విశ్వసనీయమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో విద్య, ఆరోగ్య రంగంలో పెద్ద మార్పులు ఆశించబడతాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!