IPL Update: బెంగళూరు టూ లక్నో.. మరో ఐపీఎల్ మ్యాచ్ వేదిక మార్పు..!
- మే 23న జరగాల్సిన మ్యాచ్ వేదిక మార్పు..
- బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB, SRH మధ్య మ్యాచ్...
- ఈ మ్యాచ్ ను లక్నో కు షిఫ్ట్ చేసిన బీసీసీఐ..
- బెంగుళూరులో భారీ వర్షాల కారణంగా వేదికలో మార్పు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Update: ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య గ్రూప్ మ్యాచ్ మే 23న జరగనుంది. ఈ మ్యాచ్ మొదట బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండగా.. తాజా సమాచారం మేరకు మ్యాచ్ను లక్నోకు మార్చినట్టు తెలుస్తోంది. రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ తమ హోమ్ మ్యాచ్ను ఇప్పుడు లక్నోలో ఆడాల్సి వస్తోంది. దీంతో కోహ్లికి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అభిమానులు బెంగళూరులో ఇచ్చే అభినందనల అవకాశాన్ని కోల్పోయారు. మొత్తానికి ఈ మ్యాచ్ లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
Read Also: Marriage Incentive Scheme: దివ్యాంగులకు శుభవార్త.. ఆ సమస్యకు పరిష్కారంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం..!
Also Read
తాజాగా బెంగళూరులో వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో, మే 23న కూడా వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున బీసీసీఐ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. మే 17న చిన్నస్వామిలో జరగాల్సిన ఆర్సీబీ, కోలకతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో బీసీసీఐ ఈ మ్యాచ్ను తక్షణమే వేదిక మార్చాలని నిర్ణయించింది. ఆర్సీబీ ఇప్పటికే 12 మ్యాచ్లలో 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.ఇక SRH ఇప్పటికే ప్లేఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయినా సంగంతి తెలిసిందే.
Read Also: HUAWEI nova 14 Series: శాటిలైట్ కమ్యూనికేషన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లతో హువావే నోవా 14 సిరీస్ లాంచ్..!
ఇక ఇప్పటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య 25 మ్యాచ్లు జరగగా అందులో SRH 13 విజయాలు సాధించగా, RCB 11 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఈ వేదిక మార్పుతో మ్యాచ్పై ఆసక్తి మరింత పెరిగింది. లక్నో వేదికగా వర్షాభావం ఉండే అవకాశాలు తక్కువగా ఉండటంతో అభిమానులు పూర్తి స్థాయిలో మ్యాచ్ను ఆస్వాదించగలిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!