IPL Update: బెంగళూరు టూ లక్నో.. మరో ఐపీఎల్ మ్యాచ్ వేదిక మార్పు..!
- మే 23న జరగాల్సిన మ్యాచ్ వేదిక మార్పు..
- బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB, SRH మధ్య మ్యాచ్...
- ఈ మ్యాచ్ ను లక్నో కు షిఫ్ట్ చేసిన బీసీసీఐ..
- బెంగుళూరులో భారీ వర్షాల కారణంగా వేదికలో మార్పు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Update: ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య గ్రూప్ మ్యాచ్ మే 23న జరగనుంది. ఈ మ్యాచ్ మొదట బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండగా.. తాజా సమాచారం మేరకు మ్యాచ్ను లక్నోకు మార్చినట్టు తెలుస్తోంది. రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ తమ హోమ్ మ్యాచ్ను ఇప్పుడు లక్నోలో ఆడాల్సి వస్తోంది. దీంతో కోహ్లికి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అభిమానులు బెంగళూరులో ఇచ్చే అభినందనల అవకాశాన్ని కోల్పోయారు. మొత్తానికి ఈ మ్యాచ్ లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
Read Also: Marriage Incentive Scheme: దివ్యాంగులకు శుభవార్త.. ఆ సమస్యకు పరిష్కారంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం..!
Also Read
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
తాజాగా బెంగళూరులో వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో, మే 23న కూడా వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున బీసీసీఐ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. మే 17న చిన్నస్వామిలో జరగాల్సిన ఆర్సీబీ, కోలకతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో బీసీసీఐ ఈ మ్యాచ్ను తక్షణమే వేదిక మార్చాలని నిర్ణయించింది. ఆర్సీబీ ఇప్పటికే 12 మ్యాచ్లలో 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.ఇక SRH ఇప్పటికే ప్లేఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయినా సంగంతి తెలిసిందే.
Read Also: HUAWEI nova 14 Series: శాటిలైట్ కమ్యూనికేషన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లతో హువావే నోవా 14 సిరీస్ లాంచ్..!
ఇక ఇప్పటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య 25 మ్యాచ్లు జరగగా అందులో SRH 13 విజయాలు సాధించగా, RCB 11 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఈ వేదిక మార్పుతో మ్యాచ్పై ఆసక్తి మరింత పెరిగింది. లక్నో వేదికగా వర్షాభావం ఉండే అవకాశాలు తక్కువగా ఉండటంతో అభిమానులు పూర్తి స్థాయిలో మ్యాచ్ను ఆస్వాదించగలిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?