RCB vs CSK: ఐపీఎల్లో నేడు రెండు బడా జట్ల మధ్య ఫైట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ టోర్నీలో నేడు మరో రెండు బడా జట్ల మధ్య పోరు జరగనుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్ ఓటమితో గెలుపు బాట పట్టాలని CSK కసరత్తు చేస్తోంది. మరోవైపు సొంతగడ్డపై మ్యాచ్ కావడంతో మరో విజయం నమోదు చేయాలని RCB భావిస్తోంది. ఇవాళ రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింట్లో గెలిచాయి. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన RCB తన మునుపటి ఆటలో ఢిల్లీ క్యాపిటల్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. విరాట్ కోహ్లి మరియు ఫాఫ్ డు ప్లెసిస్ జట్టుకు శుభారంభం అందించి పవర్ప్లేలో 47 పరుగులు చేశారు. హర్షల్ పటేల్ను ఐదవ స్థానానికి ప్రమోట్ చేయడం RCBకి పని చేయలేదు, ఎందుకంటే అతను ఆరు పరుగులు మాత్రమే చేయగలడు. షహబాజ్ అహ్మద్ తన ఇన్నింగ్స్లో 12 బంతుల్లో 20 పరుగులతో జట్టుకు కొంత ఫినిషింగ్ టచ్ అందించాడు. పవర్ప్లేలో క్యాపిటల్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది, ఇది వారిని బ్యాక్ఫుట్కు నెట్టింది. మనీష్ పాండే హాఫ్ సెంచరీ చేసినా జట్టును దాటలేకపోయాడు.
ఇక, ఐపీఎల్ లో సండే రోజు జరిగిన మ్యాచ్ లో మెరుపులు మెరిశాయి. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 178 రన్స్ టార్గెట్ తో క్రీజులోకి దూకిన రాజస్థాన్ రాయల్స్.. 19.2 ఓవర్లలోనే విజయం సాధించింది. హార్డ్ హిట్టర్ షిమ్రోన్ హిట్మైర్.. 26 బంతుల్లో 56 బాదేశాడు. సంజూ శాంసన్ 60 పరుగులతో రాజస్థాన్ విక్టరీలో కీ రోల్ పోషించాడు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలివుండగానే, గెలుపు బావుటా ఎగరేసింది రాజస్థాన్.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
మరోవైపు.. కోల్ కతా, ముంబై మ్యాచ్ కూడా ప్రేక్షకులను మాంచి థ్రిల్ ఇచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 185 రన్స్ చేసింది. వెంకటేష్ అయ్యర్ సెంచరీ కొట్టడంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, 186 రన్స్ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఇషాన్, సూర్య బ్యాటింగ్ తో పరుగులు యమ ఫాస్ట్ గా వచ్చాయి. దీంతో 17.4 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి ముంబై విక్టరీ కొట్టింది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..