RBI: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా.. వాటి లైసెన్స్లు రద్దయ్యాయి చెక్ చేస్కోండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిబంధనలను పాటించని బ్యాంకులపై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో హెచ్డిఎఫ్సి, హెచ్ఎస్బిసి బ్యాంకులపై పెనాల్టీ విధించిన ఆర్బిఐ ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలో పనిచేస్తున్న రెండు సహకార బ్యాంకుల లైసెన్స్లను రద్దు చేసింది. అలాగే జూలై 5, 2023న లైసెన్స్ రద్దు చేసిన తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ వ్యాపారం చేయకూడదని రెండు బ్యాంకులను కోరింది.
ఏ రకమైన డిపాజిట్ను ఆమోదించలేరు
బుల్దానాకు చెందిన మల్కాపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన సుశ్రుతి సౌహార్ద సహకార బ్యాంక్ .. బ్యాంకింగ్ లైసెన్స్లను రద్దు చేసినట్లు ఆర్బిఐ తెలియజేసింది. ప్రకటన ప్రకారం, వ్యాపారాన్ని మూసివేసిన తర్వాత.. రెండు బ్యాంకులు ఎలాంటి డిపాజిట్లను ఆమోదించలేవు లేదా ఖాతాదారులకు డిపాజిట్లు ఇవ్వలేవు.
Also Read
- IND vs AFG T20: వైభవ్తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
Read Also:New Chief Justices: తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు
డబ్బు డిపాజిట్ చేసిన వారి పరిస్థితి ఏంటి?
రెండు సహకార బ్యాంకులకు తగిన మూలధనం, ఆదాయ సంభావ్యత లేకపోవడంతో సెంట్రల్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ కో ఆపరేటివ్ కమీషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, మహారాష్ట్ర బ్యాంక్ను మూసివేయడానికి ఆర్డర్ జారీ చేయాలని.. బ్యాంకు కోసం లిక్విడేటర్ను నియమించాలని కోరింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) నుండి ఐదు లక్షల రూపాయల పరిమితి వరకు తన డిపాజిట్ యొక్క డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి ప్రతి డిపాజిటర్ అర్హులని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం, 97.60% డిపాజిటర్లు డిఐసిజిసి నుండి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు. మల్కాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకును బ్యాంకింగ్ వ్యాపారం కొనసాగించేందుకు అనుమతిస్తే అది ప్రజా ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. రాబోయే కాలంలో, ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో బ్యాంక్ తన డిపాజిటర్లకు పూర్తి చెల్లింపులు చేయలేకపోతుంది.
Read Also:IND vs WI: ఇకపై టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చూడలేమా?
తాజావార్తలు
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
IND vs AFG T20: వైభవ్తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!