Ravi Shankar Prasad: అంబేడ్కర్ను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చిందేవరు?
- భీమ్రావ్ అంబేడ్కర్ పేరుతో రాజకీయ పోరాటం
- హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై విపక్షాలు ఫైర్
- అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్
- అంబేడ్కర్ను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చారన్న బీజేపీ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్ పేరుతో రాజకీయ పోరాటం సాగుతోంది. పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎస్పీ సహా పలు రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసుకుంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దళితుల ఆవాసాలను సందర్శించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ అంబేడ్కర్ను అవమానిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్పై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
READ MORE: Seethakka: పుష్ప 2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్
Also Read
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
తాజాగా.. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “కాంగ్రెస్ గతంలో రాసిన లేఖను ప్రజల ముందుంచుతాం. బాబాసాహెబ్ అంబేడ్కర్ను ఎక్కువగా అవమానించింది కాంగ్రెస్సే. జవహర్ లాల్ నెహ్రూ ఎన్నికల్లో ఆయనను ఓడించడంతో పాటు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు.1952 ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుంచి అంబేడ్కర్ ఓడిపోయారు. ఆయనపై నారాయణ్ సదోబా కజ్రోల్కర్ విజయం సాధించారు. నెహ్రూ ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు అంబేడ్కర్కు వ్యతిరేకంగా ప్రచారానికి కూడా వెళ్లారు. ఇది మాత్రమే కాదు.. అంబేడ్కర్ను ఓడించిన అదే నారాయణ్ సదోబా కజ్రోల్కర్కు 1970లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది.” అని తెలిపారు.
READ MORE: IND vs AUS: బాక్సింగ్ డే టెస్టులో భారత్ రికార్డు ఎలా ఉందంటే..? కోహ్లీ, బుమ్రా స్పెషల్
అమిత్ షా అంబేడ్కర్ గురించి ఏమన్నారు?
ఇటీవల పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. అందులో భాగంగా “అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్.. అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అలా పదే పదే అంబేడ్కర్ పేరు స్మరించే బదులు ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేది” అని అమిత్ షా అన్నారు. దీంతో గందరగోళం ఏర్పడింది. పార్లమెంటు కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!