Rape And Kidnap: మహిళపై అత్యాచారం.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేసిన తాంత్రికుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తాంత్రికుడి ఇంటి బయట ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తాంత్రికుడు మొదట తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని మహిళ ఆరోపించింది. ఈ విషయమై మహిళ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఆ మహిళ సోమవారం తాంత్రికుని ఇంటి బయట ధర్నాకు దిగింది. మరోవైపు తాంత్రికుడి బంధువులు ఆ మహిళను పంపించాలని చూడగా.. పురుగుల మందు తాగింది.
Daksha Nagarkar: ట్యాలెంట్ చూపిస్తున్నా.. పిల్లను పట్టించుకోరేంటయ్యా
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
వివరాల్లోకి వెళ్తే.. ప్రయాగ్రాజ్లోని పూరముఫ్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ బిహ్రా నివాసి అయిన మహిళ భర్త మదన్కు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధిని నయం చేసేందుకు ఆ తాంత్రికుడు దగ్గరికి తీసుకురాగా.. ఆ మహిళపై కన్ను పడింది. దీంతో తాంత్రికుడు మొదట మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.., ఆ తర్వాత ఆమె కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఆరోపించారు. ఈ విషయమై సదరు మహిళ తాంత్రికుపై పిప్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నిందితుడు తాంత్రిక్ ఇంటి బయట మహిళ ధర్నాకు దిగిందని తెలిపారు. ఆ మహిళా తన కూతురిని వదిలేయాలని ఫోన్ లో కోరగా.. ఈ విషయమై తాంత్రికుడితో గొడవ పడ్డాడు. దీని తర్వాత నిందితుడి బంధువులు ఆమెను అక్కడనుంచి పంపించడానికి ప్రయత్నించారు. మరోవైపు బాధితురాలు తన బిడ్డను తనకు అప్పగించాలని.. లేదంటే విషం తాగుతానంటూ బెదిరించి విషం తాగింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న పిప్రి పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆ తాంత్రికుడు మహిళ యొక్క 15 ఏళ్ల కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడి బారి నుంచి కూతురిని విడిపించేందుకు ఆ మహిళ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో జూన్ 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులు తాంత్రిక్ రాజు, అతని ముగ్గురు సోదరులు విజయ్, అమర్, సురేంద్రలపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Tags
- Daughter
- kidnap
- national news
- rape
- Woman
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!