Virat Kohli: విరాట్ కోహ్లీ ఎఫెక్ట్.. అందుకు ఓకే చెప్పిన బీసీసీఐ!
- దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమమైన కింగ్
- రైల్వేస్తో మ్యాచ్లో బరిలోకి విరాట్
- విరాట్ ఆట చూసేందుకు ఫాన్స్ ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2012 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 30 నుంచి రైల్వేస్తో ప్రారంభం అయ్యే రంజీ మ్యాచ్లో ఢిల్లీ తరఫున విరాట్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం మంగళవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ కూడా చేశాడు. 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి. విరాట్ ఆట చూసేందుకు ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
రోస్టర్ విధానంలో మూడు రంజీ మ్యాచ్లకు మాత్రమే లైవ్ స్ట్రీమింగ్కు అవకాశం ఉంది. ఈ మూడింటిలో విరాట్ కోహ్లీ ఆడే మ్యాచ్కు చోటు లేదు. అయితే విరాట్ క్రేజ్ దృష్టా చివరి క్షణంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. జియో సినిమా ఓటీటీలో ఢిల్లీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుందని ఓ బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ఢిల్లీలో కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయిన వారికి ఓ శుభవార్త అని, ఫాన్స్ ఇంట్లో కూర్చొని మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. విషయం తెలిసిన విరాట్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు.
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
Also Read: KTR-Trisha: త్రిష.. నిన్ను కెప్టెన్గా చూస్తామని ఆశిస్తున్నా: కేటీఆర్
విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్తో ఘజియాబాద్లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. మెడ నొప్పి కారణంగా జనవరి 23న సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో కింగ్ ఆడలేదు. ఢిల్లీ తరఫున కోహ్లీ 23 మ్యాచ్ల్లో 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున 5 సెంచరీలు చేశాడు. రైల్వేస్తో జరిగే మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడడం లేదని తెలుస్తోంది. ఆయుష్ బడోని కెప్టెన్సీ చేయనున్నాడు.
తాజావార్తలు
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!