Virat Kohli: విరాట్ కోహ్లీ ఎఫెక్ట్.. అందుకు ఓకే చెప్పిన బీసీసీఐ!
- దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమమైన కింగ్
- రైల్వేస్తో మ్యాచ్లో బరిలోకి విరాట్
- విరాట్ ఆట చూసేందుకు ఫాన్స్ ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2012 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 30 నుంచి రైల్వేస్తో ప్రారంభం అయ్యే రంజీ మ్యాచ్లో ఢిల్లీ తరఫున విరాట్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం మంగళవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ కూడా చేశాడు. 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి. విరాట్ ఆట చూసేందుకు ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
రోస్టర్ విధానంలో మూడు రంజీ మ్యాచ్లకు మాత్రమే లైవ్ స్ట్రీమింగ్కు అవకాశం ఉంది. ఈ మూడింటిలో విరాట్ కోహ్లీ ఆడే మ్యాచ్కు చోటు లేదు. అయితే విరాట్ క్రేజ్ దృష్టా చివరి క్షణంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. జియో సినిమా ఓటీటీలో ఢిల్లీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుందని ఓ బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ఢిల్లీలో కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయిన వారికి ఓ శుభవార్త అని, ఫాన్స్ ఇంట్లో కూర్చొని మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. విషయం తెలిసిన విరాట్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు.
Also Read
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
Also Read: KTR-Trisha: త్రిష.. నిన్ను కెప్టెన్గా చూస్తామని ఆశిస్తున్నా: కేటీఆర్
విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్తో ఘజియాబాద్లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. మెడ నొప్పి కారణంగా జనవరి 23న సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో కింగ్ ఆడలేదు. ఢిల్లీ తరఫున కోహ్లీ 23 మ్యాచ్ల్లో 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున 5 సెంచరీలు చేశాడు. రైల్వేస్తో జరిగే మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడడం లేదని తెలుస్తోంది. ఆయుష్ బడోని కెప్టెన్సీ చేయనున్నాడు.
తాజావార్తలు
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..