NTV Telugu Site icon

T20 World Cup Final: ఎప్పటికీ మర్చిపోలేని విజయం: రామ్‌ చరణ్‌

Ram Charan

Ram Charan

Ram Charan and Jr NTR on India T20 World Cup Title: టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాని 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులకు కట్టడి చేసింది. జట్టు విజయంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ కీలక పత్రాలు పోషించారు. కీలక సమయంలో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యాడు. అద్భుతంగా ఆడిన భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచకప్‌ 2024 ఫైనల్ విజయం అనంతరం భారత జట్టుకు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత జట్టు అనూహ్య విజయం సాధించింది. టీమిండియా ప్రదర్శన అమోఘం. జస్ప్రీత్ బుమ్రా అదరహో. విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా పెర్ఫామెన్స్‌ అద్భుతం. మా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు వందనాలు. ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించిన భారత జట్టుకు శుభాకాంక్షలు’ అని రామ్‌ చరణ్‌ ట్వీట్ చేశారు.

Also Read: Rohit Sharma: మేం కాదు.. ప్రపంచకప్‌ అందుకోవడానికే అతనే పూర్తి అర్హుడు: రోహిత్

‘అద్భుతమైన మ్యాచ్‌ ఇది. ఎంతో గర్వంగా ఉంది. భారత జట్టుకు శుభాకాంక్షలు’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కోహ్లీ ఇన్నింగ్స్‌, బుమ్రా బౌలింగ్‌, సూర్యకుమార్‌ క్యాచ్‌, రోహిత్‌ కెప్టెన్సీ అద్భుతం. ఇది చరిత్రాత్మక విజయం. నిశ్శబ్దంగా తన మార్గనిర్దేశంలో రాహుల్ ద్రవిడ్‌ భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఇప్పుడు మనం ఛాంపియన్స్‌. మనం అజేయులం, మనం భారతీయులం’ అని లోకనాయకుడు కమల్‌ హాసన్‌ పోస్ట్ చేశారు.