Navneet Kaur Rana: ఒవైసీ సోదరులకు నవనీత్ కౌర్ మరో వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ మరోసారి ఒవైసీ సోదరులకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి వీధిలో రామభక్తులు, మోడీ సింహాలు ఉన్నాయని హెచ్చరించారు. పదేళ్ల క్రితం అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు నవనీత్కౌర్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. పాకిస్థాన్కు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదైంది. తాజాగా గతంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా నవనీత్కౌర్ తీవ్రంగా స్పందించారు. తమకు 15 సెకన్ల సమయం చాలంటూ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: IPL 2024 GT: శుభ్మన్ గిల్ అండ్ టీంకు షాకిచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ..
Also Read
- Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
తన సోదరుడు అక్బరుద్దీన్ ఫిరంగి అంటూ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. దీనికి తాజాగా ట్విట్టర్ వేదికగా నవనీత్ స్పందించారు. అక్బరుద్దీన్ ఫిరంగి అయితే.. అలాంటి ఫిరంగులు మా ఇంటి బయట అలంకరణ కోసం ఉంచుతామని చెప్పారు. ఇక ఇండియాలో రామభక్తులు, మోడీ సింహాలు ప్రతి వీధిలో తిరుగుతున్నారన్నారు. తాను హైదరాబాద్ వస్తున్నానని.. తనను ఎవరు ఆపుతారో చూస్తానని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కేసు నమోదైన మరుసటి రోజే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల క్రితం పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే జనాభా లెక్కలు సరిచేస్తామంటూ 2013లో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నవనీత్ కౌర్.. తమకు 15 సెకన్ల సమయం చాలని నవనీత్ వ్యాఖ్యనించారు. మేము ముందుకు వస్తే.. 15 సెకన్ల సమయం పడుతుందని నవనీత్ తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ లో ఒవైసీ సోదరులను ట్యాగ్ చేశారు.
ఇది కూడా చదవండి: PVS Swetha: డైరెక్టర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ కొత్త అవతారం
హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత తరఫున ప్రచారం నవనీత్ ప్రచారం చేశారు. నాలుగుసార్లు లోక్ సభ ఎంపీగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ప్రత్యర్థిగా బీజేపీ తరపున మాధవీలత పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపడం ఇదే తొలిసారి.
అసదుద్దీన్ 2004 నుంచి హైదరాబాద్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో తొలిసారి గెలిచారు. అంతక ముందు 1984 నుంచి ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ లోక్ సభ స్థానంతో పాటు గోషామహల్ మినహా హైదరాబాద్ లోని అన్ని అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం ఆధీనంలో ఉన్నాయి. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది.
मुर्गी और मुर्गी का बच्चा कब तक खैर मनाएंगे @asadowaisi @AkbarOwaisi_MIM pic.twitter.com/iwqX6frGn7
— Navnit Ravi Rana (@navneetravirana) May 10, 2024
తాజావార్తలు
-
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!