Navneet Kaur Rana: ఒవైసీ సోదరులకు నవనీత్ కౌర్ మరో వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ మరోసారి ఒవైసీ సోదరులకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి వీధిలో రామభక్తులు, మోడీ సింహాలు ఉన్నాయని హెచ్చరించారు. పదేళ్ల క్రితం అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు నవనీత్కౌర్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. పాకిస్థాన్కు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదైంది. తాజాగా గతంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా నవనీత్కౌర్ తీవ్రంగా స్పందించారు. తమకు 15 సెకన్ల సమయం చాలంటూ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: IPL 2024 GT: శుభ్మన్ గిల్ అండ్ టీంకు షాకిచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ..
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
తన సోదరుడు అక్బరుద్దీన్ ఫిరంగి అంటూ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. దీనికి తాజాగా ట్విట్టర్ వేదికగా నవనీత్ స్పందించారు. అక్బరుద్దీన్ ఫిరంగి అయితే.. అలాంటి ఫిరంగులు మా ఇంటి బయట అలంకరణ కోసం ఉంచుతామని చెప్పారు. ఇక ఇండియాలో రామభక్తులు, మోడీ సింహాలు ప్రతి వీధిలో తిరుగుతున్నారన్నారు. తాను హైదరాబాద్ వస్తున్నానని.. తనను ఎవరు ఆపుతారో చూస్తానని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కేసు నమోదైన మరుసటి రోజే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల క్రితం పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే జనాభా లెక్కలు సరిచేస్తామంటూ 2013లో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నవనీత్ కౌర్.. తమకు 15 సెకన్ల సమయం చాలని నవనీత్ వ్యాఖ్యనించారు. మేము ముందుకు వస్తే.. 15 సెకన్ల సమయం పడుతుందని నవనీత్ తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ లో ఒవైసీ సోదరులను ట్యాగ్ చేశారు.
ఇది కూడా చదవండి: PVS Swetha: డైరెక్టర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ కొత్త అవతారం
హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత తరఫున ప్రచారం నవనీత్ ప్రచారం చేశారు. నాలుగుసార్లు లోక్ సభ ఎంపీగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ప్రత్యర్థిగా బీజేపీ తరపున మాధవీలత పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపడం ఇదే తొలిసారి.
అసదుద్దీన్ 2004 నుంచి హైదరాబాద్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో తొలిసారి గెలిచారు. అంతక ముందు 1984 నుంచి ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ లోక్ సభ స్థానంతో పాటు గోషామహల్ మినహా హైదరాబాద్ లోని అన్ని అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం ఆధీనంలో ఉన్నాయి. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది.
मुर्गी और मुर्गी का बच्चा कब तक खैर मनाएंगे @asadowaisi @AkbarOwaisi_MIM pic.twitter.com/iwqX6frGn7
— Navnit Ravi Rana (@navneetravirana) May 10, 2024
తాజావార్తలు
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..