NTV Telugu Site icon

R Krishnaiah: ఏపీలో వైసీపీ ఓటమిపై రాజ్యసభ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

R Krishnaiah

R Krishnaiah

R Krishnaiah: ఏపీలో వైసీపీ ఓటమిపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్పందించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు జగన్ అందించారని.. ఎక్కడ ఏమి జరిగిందో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ వైసీపీకే ఓటు వేస్తున్నామని చెప్పారని పేర్కొన్నారు. ఓటమిపై లోతైన విశ్లేషణ జరుగుతుందన్నారు. జగన్‌ను ప్రజలు వద్దు అనుకోలేదని.. ఎక్కడ తప్పు జరిగింది..ఈవీఎంలో ఏమైనా లోపం ఉందా అనే అనుమానం ఉందన్నారు. జగన్ అహంకారంతో ఓడిపోలేదన్నారు. ఏపీ అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం ఏమీ చేస్తుంది అనే అంశంపై తాను ఇప్పుడే స్పందించనని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135, జ‌న‌సేన 21, వైఎస్సార్‌సీపీ 11, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది టీడీపీ. ఈ నేప‌థ్యంలో 12వ తేదీన చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

Read Also: ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు.. చాలా అన్యాయం అన్న అంటూ యాంకర్ శ్యామల వీడియో